ఆటలు ఆరోగ్యానికి మంచివే కానీ అతిగా చేసే ఏదీ కూడా ఒంటికి మంచిది కాదు అన్నది నిజం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న పిల్లలు ఒంట్లో చెమట రాకుండా కూర్చొని ఆడే ఆటలంటే ఇస్టపడుతున్నారు. అయితే తాజాగా ఓ చిన్నారి ఆట ఉదంతం అందరిని కలచి వేస్తోంది. గంట.. రెండు గంటలయితే ఫర్వాలేదు.. ఏకధాటిగా నిద్రహారాలు మానుకుని వీడియోగేమ్ ఆడితేనే అసలు సమస్య. నలభై గంటల పాటు నిద్రాహారాలు మాని వీడియో గేమ్ ఆడి మృత్యువాతపడిన ఓ టీనేజర్ ఉదంతం గతంలో విన్నాం. ఇప్పుడు ఏకంగా 22 రోజుల పాటు ఆడి మరో యువకుడు ప్రాణాలను పణంగా పెట్టాడు.
రష్యాకి చెందిన ఓ యువకుడు 22 రోజులు ఏకధాటిగా వీడియో గేమ్ ఆడాడు. చివరకు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. బష్కోర్తోస్తాన్ రిపబ్లిక్లోని ఉల్చాయ్ కి చెందిన 17 ఏళ్ల రుస్తాం కాలు విరగడంతో గత నెల 8 నుంచి ఇంటికే పరిమితమయ్యాడు. బెడ్ రెస్టులో ఉన్న యువకుడు బోర్ కొట్టుకుండా ఉండేందుకు ఆన్లైన్లో డిఫెన్స్ ఆఫ్ ది ఏన్షియంట్స్ అనే గేమ్ ఆడడం మొదలుపెట్టాడు. ఆట ధ్యాసలో పడి తిండి, నిద్ర తప్పితే మిగతా సమయం అంతా అదేపనిగా గేమ్లో మునిగితేలాడు. అతని తల్లిదండ్రులు కూడా ఉద్యోగంలో బిజీగా ఉండి పెద్దగా పట్టించుకోలేదట. రోజూ యువకుడి గదిలో నుంచి కీబోర్డు సౌండ్లు వచ్చేవి కానీ.. గత నెల 30న శబ్ధాలు వినిపించలేదు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు లోపలికి వెళ్లి చూడగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఆప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. నడక, ఇతర శారీరక కదలికలు లేకపోవడంవల్ల రక్తం గడ్డ కట్టి రుస్తాం చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.ఒకటి లేదా రెండు గంటలు అయితే ఫర్వాలేదు. అదేపనిగా వీడియోగేమ్ ఆడటాన్ని ఒక మానసిక జబ్బుగా పరిగణించాలంటున్నారు నిపుణులు. దూకుడు ప్రవర్తనతో పాటు మానసిక సమస్యలు కూడా ఉన్నాయంటున్నారు పిల్లలూ... పేరెంట్స్ బీకేర్ఫుల్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more