రోజుకో కొత్త రకం దగాలు, మోసాలు వెలుగుచేస్తున్న క్రమంలో ట్రయల్ రన్ పేరుతో ఖరీదైన బైక్ తో ఉడాయించిన సిరిలేని శ్రీమంతుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తాను పెద్ద శ్రీమంతుడిలా పోజు కొడుతూ.. తన స్తాయికి తగినట్లు ఖరీదైన బైక్ కావాలని ఏరీ కోరి ఆరు లక్షఃల రూపాయల ఖరీదైన లేటెస్టు హార్లీ డేవిడ్ సన్ బక్ తీసుకుని టెస్ట్ డ్రైవ్ చేస్తానని నమ్మబలికి ఉడాయించిన భీమవరం యువకుడు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దోరికాడు. నిందితుడిని 48 గంటలు కూడా గడవకముందే ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు నిందితుడు ఓఎన్జీసీ సబ్ మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. విచారణ నిమిత్తం నిందితుడిని ముంబై నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు పోలీసులు.
బంజారాహిల్స్ రోడ్ నంబరు 2 సాగర్ సొసైటీ చౌరస్తాలో హార్లీ డేవిడ్సన్ బైకుల షోరూంకు మంగళవారం రోజు సాయంత్రం రిచ్ లుక్ తో శ్రీమంతుడి తరహాలో డాబు కోడుతూ ఓ యువకుడు వచ్చాడు. తన పేరు సయ్యద్ తాహెర్ అని చెప్పాడు. తాను జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 23 నివాసినని, తనకు. ఓ ఖరీదైన బైకు కావాలని చెప్పడంతో.. సిరిలేని శ్రీమంతుడి డాబు చూసి..షోరూం నిర్వాహకులు స్ట్రీట్-750 మోడల్ వాహనాన్ని చూపించారు. ఆ బైక్ ఖరీదు రూ.6 లక్షలని చెప్పారు. తన క్రెడిట్ కార్డుల నుంచి కొంత మరికోంత ఫైనాన్స్ ద్వారా చెల్లిస్తానని చెప్పిన నిందితుడు నమ్మబలికాడు. దీనికి షోరూం నిర్వాహకులు అంగీకరించారు.
ట్రయల్ రన్ వేసి చూస్తానని బైకును తీసుకొని బయటకు వచ్చి నాగార్జున సర్కిల్ వైపు వెళ్లాడు. ఐదు నిమిషాలు గడిచాయి.. పది నిమిషాలు.. అరగంట.. గంట.. మూడుగంటలు.. ఇలా ఎంతకీ రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న షోరూం నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించడంతో.. వారు హుటాహుటిన టోల్ గేట్లను, జిల్లాల పోలీసులను అలెర్ట్ చేసినప్పటికీ.. నిందితుడు రాష్ట్ర సరిహద్దులు దాటి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి చేరుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేయడానికి నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఎట్టకేలకు ముంబైలో అరెస్టు చేశారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more