దేశ వ్యాప్తంగా ఉల్లి ధర ఘాటు వినియోగదారుల నశాలానికి ఎక్కి కన్నీళ్లు పెట్టిస్తున్న సమయంలోనే అటు టమాటా, బంగాళాదుంపలు (ఆలుగడ్డలు) ధరలు మాత్రం గిట్టుబాటు ధర కూడా రాక రైతులకు కండగండ్లను మిగిల్చుతున్నాయి. ఉఃల్లి ధరల పెరగడంతో అటు వినియోగదారులు వాటిని కొనడానికి కూడా అయిష్టతను వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇటు పెట్టిన పెడుబడులు రాకపోవడంతో టమోటా, ఆలు రైతులు లబోదిబోమంటున్నారు. ఆలు, టమోటా ధరలు ఎంతగా పడిపోయాయంటే రైతులు వాటిని పండించేందుకు పెట్టిన పెట్టుబడి ధరలు కూడా రాకపోవడంతో ఊసూరుమంటున్నారు
ఆలు పంటలు పండిని ఉత్తర్ ప్రధేశ్, పంజాబ్, రాజస్తఆన్ రైతులు కేజీకి నాలుగు నుంచి ఆరు రూపాయలు మాత్రమే రావడంతో.. వాటిని కనీసం మార్కెట్లకు తీసుకువచ్చిన ధరలు కూడా గిట్టుబాటు కాక మార్కెట్ల వద్ద ఉచితంగా పంచుతూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాగా టామోటాల్లోకి రారాజుగా ప్రఖ్యాతి చెందిన బెంగుళూరు టామాటాకే కిలోకు 9 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఇక సాధారణ టమోటాలకు ఐదు నుంచి ఆరు రూపాయల మధ్య ధర పలుకుతుంది. అయితే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాక ఆలు, టమోటా పంటల ధరలు తగ్గింపుపై అధ్యయనం చేస్తుందని, రైతులు అసంతృప్తికి కారణాన్ని కనుగోనే పనిలో వున్నాయని వ్యవసాయ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more