మేరా భారత్ మహాన్... తప్పు చేసిన వాడు తన పాపాన తానే పోతాడు.. చట్టాలు ఏమీ చెయ్యవు.. ఇండియాలో మారణహోమం సృష్టించడం హనీమూన్ కు వెళ్లినట్లు ఎంచక్కా ఎగేసుకొని పాకిస్థాన్ కు వెళ్లిపోతారు. అయినా వాళ్లను ఎన్నటికీ తిరిగి ఇండియాకు రప్పించలేం. ఇండియాలో ఎన్నో బాంబ్ దాడులు జరిగాయి.. ఎంతో మంది ఉగ్రవాదులు , డాన్ లు దర్జాగా ఇండియా బోర్డర్ దాటి వెళ్లిపోతున్నారు. అయినా మనం మాత్రం అదేదో సినిమా లో ఎపిసోడ్ లా అలా ఊహించుకొని గాలికొదిలేస్తున్నాం. తాజాగా ముంబై వరుస దాడుల సూత్రదారుల్లో ఒకడైన యాకుబ్ ఖాన్ అలియాస్ యెద్ యాకుబ్ అనారోగ్యంతో మరిణించినట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముంబైలో వరుస పేలుళ్ల ఘటనలో ఎంతో మంది అమాయకులు, చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోయారు. అయినా సరే అలాంటి వారు భారత చట్టాలకు దొరకకుండా దొంగ. పోలీస్ ఆడుతున్నారు. అయినా ఇప్పటి వరకు వాళ్లను పట్టుకోవడంలో విఫమవుతునే ఉన్నాం.
భోపాల్ గ్యాస్ ఉదంతానికి కారణమైన వాడిని.. దర్జాగా దేశం నుండి సెండాఫ్ ఇచ్చి మరీ రాచమర్యదాలతో వీడ్కోలు పలికారు. అయినా రాజకీయాల్లో ఉగ్రవాదులకు, జాతి ద్రొహులకు మద్దతు పలికే విశ్వాసం లేని కుక్కలు ఉన్నంత కాలం దేశానికి ఇలాంటి తిప్పలు తప్పవు. మనుషుల ప్రాణాలు తీసిన కిరతకులను మన చట్టాలు ఏమీ చెయ్యలేని పరిస్థితి.. ఏదో ఒక సారి ఎవడో ఒక ఉగ్రవాదిని పట్టుకుంటే మతం పేరుతో అడ్డుకోవడానికి సవాలక్ష మంది దేశభక్తులు.. మతం ముసుగులో ఉన్న అతి మంచి వాళ్లు మా మతం వ్యక్తి కాబట్టే అలా ఉరి తీశారు.. అలా శిక్షించారు అంటూ విపరీతాలు మాట్లాడుతున్నారు. మొత్తానికి ఎంత కిరాతకం సృష్టించినా.. ప్రజల ప్రాణాలు తీస్తున్నా.. వాడి విధి మీద వాడిని వదిలేసే మహోన్నోత దేశం. ఇక్కడ మాత్రమే ఉగ్రవాదులకు సపోర్ట్ దొరుకుతుంది.. ఉగ్రవాదులు చస్తే మహానుభావుడు చస్తే చేసినట్లు గొప్పగా ఊరేగింపులు చేస్తారు అందుకే మేరా భారత్ మహాన్ అని గర్వంగా చెప్పుకుంటున్నా..
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more