అంచనాలు నిజమవుతున్నాయి. బంగారం నిజంగానే నేల చూపులు చూస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. నాలుగేళ్ల కనిష్ఠానికి పసిడి ధరలు పతనమయ్యాయి. 10 గ్రాముల బంగారం 25 వేల లోపు మార్కుకు చేరింది. డాలర్ బలపడడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చర్యలతో భవిష్యత్ లో మార్పులు ఉంటాయన్న సెంటిమెంట్ తో ప్రపంచవ్యాపంగా బంగారానికి డిమాండ్ తగ్గిపోతోంది. గతంలో అంచనా వేసినట్లే.. బంగారం ధర మరింత తగ్గిపోయింది. పసిడి వెలుగులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు 10 గ్రాముల బంగారం ధర 30 వేల రూపాయల పైమాటే. కానీ మారిన మార్కెట్ పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా పసిడి నేలచూపులు చూస్తోంది. వరుసగా ధరలు పతనమవుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లే... భారత్ లో ఏకంగా పది గ్రాముల పచ్చలోహం ధర 25 వేల మార్కు దిగువకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. నిన్నటి లెక్క ప్రకారం.. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం.. ఢిల్లీలో 24 వేల 980 రూపాయలు పలికింది.
2011, ఆగస్టు 6న 24 వేల 980 రూపాయలు ధర పలికిన బంగారం.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అదే స్థాయికి దిగజారింది. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ పుంజుకోవడంతో మదుపుదారులు తమ పెట్టుబడి మార్గాన్ని మళ్లించడం పసిడి పతనానికి కారణమవుతోంది. మార్కెట్లు అనిశ్చితి ఉన్న సమయంలో పెట్టుబడి దారులు సాధారణంగా పసిడికే ప్రాధాన్యం ఇస్తారు. కానీ కాలం కలిసి వస్తే ప్రత్యామ్నాయాలవైపూ మళ్లుతారు. తాజాగా జరుగుతోంది కూడా అదే. అందుకే ఆకాశంలో ఉండే బంగారం ధరలు ప్రస్తుతం నేల చూపులు చూస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 25 | అగ్రరాజ్యంలో ఎందరు అధ్యక్షులు మారినా అక్కడి ప్రజల్లో తుపాకీ సంస్కృతిని నియంత్రించే అంశంలో మాత్రం మార్పు తీసుకురాలేకపోతున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ విషయంలో ఏదో చేయాలని తాను అనుకున్నా.. చివరకు... Read more
Jan 21 | తెలంగాణ అధికార పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తనయ.. షేక్ పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డీలు పరస్పరం బంజారాహీల్స్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేసుకున్నారు. అదేంటి కేకే తనయ విజయలక్ష్మి... Read more
Jan 21 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలతో ఏకీభవించని న్యాయస్థాన ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలను బలపరుస్తూ రాష్ట్రంలో... Read more
Jan 21 | టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావును అరెస్టు చేయలేదని, కేవలం విచారణకు మాత్రమే పిలిచామని విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారీ తెలిపారు. రామతీర్థాన్ని టీడీపీ నేతలు సందర్శించిన రోజున జరిగిన ఘటనపై... Read more
Jan 21 | అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రెండో పర్యాయం బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్ ను గణనీయమైన ఓట్లతో ఓడించి.. ఆయన... Read more