దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో మారణహోమం సృష్టించిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల్లో సజీవంగా దొరికిన అబ్దుల్ కసబ్ తరువాత మరో ఉగ్రవాదిని భారతీయ ఆర్మీ దళాలు సజీవంగా పట్టుకున్నాయి. సదరు ఉగ్రవాది పాకిస్థాన్ కు చెందిన ఖాసింఖాన్ గా అర్మీ అధికారులు గుర్తించారు. ఈ ఉదయం ఉదంపూర్ సమీపంలో బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఒక ఉగ్రవాదిని బిఎస్ఎప్ జవాన్లు సజీవంగా పట్టుకున్నారు. బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై దాడి జరిపిన ఘటనలో బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే ప్రతిదాడికి దిగారు.
ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతం కాగా, మరో ఉగ్రవాది ముగ్గురు స్థానిక పౌరులను తన ఆథీనంలోకి తీసుకుని బిఎస్ఎఫ్ జవాన్ల దాడికి చెక్ పెట్టాడు. బీఎస్ఎఫ్ జవాన్ల కాల్పులను నిలిపివేతను అదునుగా చేసుకున్న ఉగ్రవాది ఖాసింఖాన్.. సమీపంలోని అటవీ ప్రాంతాలోకి పరుగులు తీశాడు. నాలుగు గంటల పాటు సదరు ఉద్రవాదికి, బీఎస్ ఎప్ జవాన్లకి మద్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆ తరువాత ఉగ్రవాది చెరలో వున్న ముగ్గరు స్థానికుల సహాకారంతో ఉగ్రవాదిని తుదముట్టించేందుకు యత్నించిన బీఎస్ఎష్ జవాన్లు ఆ ముష్కరుడిని ఏకంగా ప్రాణాలతోనే పట్టుకున్నారు.
కసబ్ తరువాత మరో ఉగ్రవాది ప్రాణాలతో సజీవంగా పట్టుబటడం ఇదే ప్రథమం. కాగా సదరు ఉగ్రవాది పేరు ఖాసిం ఖాన్ అని, అతని 20 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సులో వున్నాడని అంచనా వేస్తున్నారు. అతను పాకిస్తాన్ లోని ఫైసలాబాద్ కు చెందినవాడుగా అనుమానిస్తున్నారు. పంజాబ్ లోని దీన్ దార్ లో జరిగిన ఉగ్రదాడిలో ఒక ముష్కరిడైనా సజీవంగా పట్టుకోవాలన్ని భారత్ ఆర్మీ ప్రయత్నాలు ప్రతిఫలించలేదు. కాగా, ఇవాళ మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకుని భారత్ ఆర్మీ దళాలు విజయాన్ని సాదించాయి. దీంతో దాయధి దేశం పాకిస్థాన్ అసులు రంగును, స్వరూపాన్ని ప్రపంచానికి చూపించే అవకాశం భారత్ కు మరోమారు దక్కింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more