తనదైన నటనాశైలితో దక్షణాది సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ఖుష్బూ.. ఇప్పుడు జనాల్లో మరింత మమేకమయ్యేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక్క ఫోన్ కొడితే చాలు.. తాను స్వయంగా వీధుల్లోకి వాలిపోతానని ఆమె స్వయంగా పేర్కోవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇంతేకాదు.. ఈమె ఇచ్చిన బహిరంగ ప్రసంగానికి జనాలు ఒక్కసారిగా ఉప్పొంగిపోయి ఆమెను చప్పట్లతో ముంచెత్తారు. ఇంతకీ ఆమె ఏం చెప్పింది..? వీధుల్లోకి ఎందుకు వస్తానంది..? ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఏంటి..? అని అనుకుంటున్నారా..! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!
సినీపరిశ్రమ ద్వారా దేవతలా తమిళ ప్రేక్షకుల హృదయాల్లో గుడి కట్టించుకున్న ఖుష్బూ.. ఇప్పుడు రాజకీయరంగంలో తన సత్తా చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈమె తనదైన శైలిలో ప్రసంగాలు ఇస్తూ ప్రజల్ని తనవైపుకు మరలించుకోవడమే కాకుండా.. పార్టీ పెద్దల్ని ఆకట్టుకుంటోంది. ఇందుకు నిదర్శనంగా తాజాగా ఆమె ఇచ్చిన ప్రసంగమే ఉదాహరణగా తీసుకోవచ్చు. తమిళనాడు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఖుష్బూ ఓ సందర్భంలో ఈ విధంగా ప్రసంగించింది.. ‘ఏదైనా సమస్యపై పోరాటం చేయాలని భావించేవారు నాకు ఒక్క ఫోన్ కొడితే చాలు.. స్వయంగా వచ్చి వీధి పోరాటాలు చేస్తాను’ అని ఆమె పిలుపునివ్వడం అక్కడున్న జనాల్లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో వారు ఆమెను జనాలు చప్పట్లతో ముంచెత్తారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శోజా ఓజా ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల ఎంపిక కోసం తమిళనాడులో ఓ సమావేశం జరిగింది. ఈ పదవి కోసం పలువురు సీనియర్ నేతలు పోటీపడ్డారు. ఆ సమావేశంలో వారు తమతమ రీతిలో ప్రసంగాలు చేశారు. అయితే.. వారందరికి భిన్నంగా ఖుష్బూ తనదైన శైలిలో ప్రసంగించి కాంగ్రెస్ కార్యకర్తలతో, జనాలతో చప్పట్లు కొట్టించుకున్నారు. ఇంటిపక్క సమస్యైనా, నియోజకవర్గ సమస్యైనా పోరాటం చేయాల్సి వస్తే.. తనవద్దకు నేరుగా రావాల్సిన అవసరం లేదని, ఒక్క ఫోన్ చేస్తే చాలని ఆమె పేర్కొంది. ప్రజల కోసం శ్రమించేందుకు, ఉద్యమాలు చేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగానే వుంటానని ఆమె తెలిపింది. ఇలా ఈ విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి.
అలాగే.. పార్టీ అధికార ప్రతినిధిగా వున్న తనను ప్రతి చోటకు ఆహ్వానించే అవకాశం లేదని, అధికారిక కార్యకర్తలకు వుందని ఖుష్బూ వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఆమె ప్రసంగించడంతో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల పదవికి ఈమెనే ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారని తెలుస్తోంది. మహిళా అధ్యక్షురాలి పదవికి ప్రజాకర్షణ కల్గిన నేతను ఎంపిక చేయాలని లక్ష్యంతో వున్న ఏసీసీసీ.. అందుకు అన్నిరకాల అర్హతలు నటి ఖుష్బూకు వున్నాయని అభిప్రాయాలు వెల్లడిస్తున్నారట. దీంతో.. ఆమె నియామకం దాదాపు ఖరారైనట్టేనని సమాచారం. మొత్తానికి ఖుష్బూ చిత్రపరిశ్రమలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ తన సత్తా చాటుకోవడం సక్సెస్ అవుతోందన్నమాట!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more