ఇండియన్ చిత్రపరిశ్రమలో ఇప్పటికే కొన్ని జబ్బులు ఒక ఇండస్ట్రీ నుంచి మరొక ఇండస్ట్రీకి చక్కర్లు కొడుతున్నాయి. ఏదైనా ఒక ప్రాంతీయ సినిమా మంచి విజయం సాధించిందంటే చాలు.. దానిని బాలీవుడ్ సైతం రీమేక్ చేసేస్తుంది. అలాగే.. బాగా పాపులర్ అయిన హీరోల సినిమాలను డబ్ చేసి ఇతర భాష పరిశ్రమల్లో ప్రదర్శిస్తుంటారు. ఇలా ఈ రెండు జబ్బులు చక్కర్లు కొడుతుండగానే.. టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన మరో జబ్బు బాలీవుడ్ కి పాకింది. ఇంతకీ ఆ మరో జబ్బు ఏంటనీ ఆలోచిస్తున్నారా..? ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం విడుదలకు ముందే లీక్ అయి తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! ఆ సినిమా ఇంకా ల్యాబ్ లో వుండగానే.. దాదాపు పూర్తి సినిమా లీకయ్యింది. అప్పట్లో అది పెద్ద దుమారాన్నే రేపింది. ఇక రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమాలోని సన్నివేశం కూడా ఆమధ్య లీక్ అయ్యి కలకలం సృష్టించింది. ఇప్పుడు ఈ ‘లీకేజ్’ జబ్బు బాలీవుడ్ కి కూడా పాకింది. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘గంగాజల్-2’ చిత్రం కూడా లీకేజ్ బారిన పడిందని సమాచారం!
అజయ్ దేవగన్ నటించిన ‘గంగాజల్’ చిత్రానికి సీక్వెల్ గా రానున్న ‘గంగాజల్-2’ సినిమాని సామాజిక సమస్యల్ని ఇతివృత్తంగా తీసుకుని చిత్రాలను రూపొందించే ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలో వుండగా.. అప్పుడే ప్రియాంక నటించిన ఓ సన్నివేశం లీకై ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న యూనిట్.. వెంటనే అప్రమత్తమైంది. ఈ సన్నివేశం ఎలా లీకయ్యింది? ఎవరు చేశారు? అన్న విషయాలపై ఆరా తీస్తోంది. కాగా.. ప్రమోషన్ గిమ్మిక్కుల్లో ఇది కూడా ఒక భాగమే అయి వుంటుందని కొందరు సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more