తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ముదురుతున్నాయి. టేపులతొ మొదలైన వివాదం ట్యాపింగ్ వరకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దూకుడుకు ఫి ప్రభుత్వం సవాల్ తో పరిస్థితి వేడిగా మారింది. అయితే రెండు రాష్ట్రాల విభేదాల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని కేంద్రం బావిస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాలను తగ్గమని కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తనను కలిసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ద్వారా కేసీఆర్ కు సమాచారం పంపినట్లు తెలుస్తోంది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న వత్తిడికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కార్ కు హుకుం జారీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. నిన్నటి దాకా రెండు రాష్ట్రాల వాదనలు విన్న కేంద్రం ఇక వ్యవహారం చాలా దూరం వెళుతోందని అందుకే జోక్యం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటిదాకా జరిగింది చాలు! ఇంతకు మించి వద్దు! ఇంకా... రచ్చకెక్కవద్దు అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇద్దరు సీఎంలకు స్పష్టం చేశారు. గోరంతను కొండంతలు చేసుకోవద్దని హితవు పలికినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇంతకు మించి ముందుకు వెళితే మీకే ఇబ్బంది వచ్చే ప్రమాదముందని తెలంగాణ సర్కారుకు పరోక్ష సంకేతాలు కూడా పంపించారు. కేంద్ర మంత్రి సూచనలను పాటించినట్లయితే... టేపులు, ట్యాపుల వివాదం మొత్తం కొదిరోజుల్లోనే చప్పున చల్లారిపోయే అవకాశముంది. ఆయన మాట వింటారా లేదా, ఈ వివాదం ఇంతటితో ఆగిపోతుందా, లేదా అనే విషయం పక్కనపెడితే... ప్రస్తుతానికైతే టెలిఫోన్ ట్యాపింగ్పై తమకు లభించిన ఆధారాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. తమ ప్రభుత్వ పెద్దలు, ఇతర ప్రముఖుల ఫోన్లను తెలంగాణ సర్కారు ట్యాప్ చేసిందంటూ కేంద్రానికి ఏపీ అధికారులు కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ట్యాపింగ్పై అంతర్గత విచారణ చేసి నివేదిక రూపొందించాలని కేంద్రం భావిస్తోంది. ట్యాపింగ్ తీవ్రమైన నేరమని, కేసీఆర్ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందని అని కేంద్రం అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. మరి కేంద్రం హెచ్చరికలతో తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more