వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటీనటులు.. ఆ తర్వాత సినీఫక్కీలో తమ కెరీర్ సాఫీగా సాగని క్రమంలో వ్యాపార, రాజకీయ లేదా ఇతర రంగాల్లో అడుగిడుతుంటారు. కనీసం ఆ రంగాల్లోనైనా లాభార్జన పొందవచ్చునని లేదా తమను తాము మరింత పాపులర్ చేసుకోవచ్చన్న ఉద్దేశంతో వాటిపై దృష్టి సారిస్తుంటారు. ఇప్పటికే ఎందరో నటీనటుల్లో కొందరు వ్యాపారం రంగంలోనూ, మరికొందరు రాజకీయాల్లోనూ తమ స్థానం పదిలపర్చుకున్నారు. ఇంకొంతమంది రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మరో సినీనటి రాజకీయాల్లో రంగప్రవేశం చేసేందుకు సమాయత్తమవుతోందని సమాచారం!
ప్రముఖ శాండల్వుడ్ నటి ప్రియా హాసన్ త్వరలోనే రాజకీయాల్లోకి రానుంది. యాక్షన్ చిత్రాల ద్వారా శాండల్వుడ్లో తనదైన ముద్ర వేసిన ఈమె... ‘బిందాస్ హుడుగి’, ‘జంభద హుడుగి’ చిత్రాల ద్వారా కన్నడ ప్రేక్షకులకు చేరువైంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఈ నటి.. తాజాగా ‘స్మగ్లర్’ అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే.. ఈమె దృష్టి రాజకీయాలవైపు మళ్లిన నేపథ్యంలో అందులో రంగప్రవేశం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఈ నటి.. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల ద్వారా ఆమె ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆమె సన్నద్ధం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియా హాసన్ బీబీఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం.
ఇదిలావుండగా.. రమ్య, పూజాగాంధీ, రక్షిత తదితర కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీమణులు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురూ గత ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున పోటీ చేసి పరాజయం పొందారు. మరి.. ఇప్పుడు ప్రియా హాసన్ విజయం దక్కించుకుంటుందా..? లేదా..? అన్నది వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more