బాలీవుడ్ గత తరం ప్రముఖ నటుడు శశికపూర్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. ఇవాళ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నటుడు శశికపూర్ ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆదివారం పశ్చిమ ముంబైలోని ఫృధీ థియేటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శశికపూర్కు అరుణ్ జైట్లీ ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి శశికపూర్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ ప్రముఖ నటీనటులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
2013 ఏడాదికిగాను కేంద్ర ప్రభుత్వం శశికపూర్కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. గత నెల మూడున రాష్ట్రపతి ప్రణ్ ముఖర్జీ చేతులు మీదుగా అందుకోవాల్సిన ఈ అవార్డును తీవ్ర అనారోగ్యం కారణంగా ఢిల్లీకి వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో తాను పురస్కారం అందుకోవడానికి న్యూఢిల్లీ రాలేనని ఆయన కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. దాంతో ఆదివారం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదగా శశికపూర్ దాదా ఫాల్కే పురస్కారం అందుకున్నారు.
2011లో శశికపూర్కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన విషయం విదితమే. 1961 లో ధర్మపుత్ర చిత్రం నుంచి ప్రధాన పాత్రలలో నటించిన శశికపూర్ నాలుగేళ్ల వయస్సు నుంచే నాటకాలలో రాణించారు. 60, 70. 80 దశకం మధ్య వరకు అనేక చిత్రాలలో నటించిన శశికపూర్ మొత్తంగా 116 చిత్రాలలో ప్రధాన ప్రాత పోషించారు. ఆయన చిత్రాలలో దీవర్, కబి కబి, నమక్ హలాల్, కాల ఫత్తర్, తదితర చిత్రాలు అప్పట్లో సంచలనం సృష్టంచాయి
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more