పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠం.. తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద శ్రీవారి సాక్షిగా ఒక్కటవుదామనుకున్నారు ఆ జంట. వాళ్లు ఇద్దరూ వైద్యులు.. ప్రేమించుకున్నారు. మరికాసేపట్లో మూడు ముళ్లు పడి ఒక్కటవ్వాల్సిన జంటను దీవించేందుకు ఇరువైపుల వారి తల్లిదండ్రులు కూడా వున్నారు. అయితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఈ పెళ్లి చివరిక్షణంలో ఆగిపోయింది. ఎందుకిలా..? ఇద్దరు బాగా చదువుకున్నారు..? వైద్యులంటున్నారు.. మరెందుకు అగిపోయింది..? కట్నం కోసమా..? చివరి నిమిషంలో వధువు తల్లిదండ్రులను వరుడు కట్నం కోసం వేధించడంతో నిలిచిపోయిందా..? అంటూ అనుమానాలు వ్యక్తచేయకండీ.. అసలు జరిగిందేంటంటే..
కర్ణాటక రాష్ట్రంలోని కోలార్కు చెందిన అనిల్(34), కవిత(28) వైద్యులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏడుకొండల స్వామి సాక్షిగా వీరిద్దరు ఏడడుగులు నడవాలనుకున్నారు. శుక్రవారం మంచి ముహుర్తం ఉండటంతో టీటీడీ పౌరోహిత సంఘంలో వివాహం కోసం దరఖాస్తు చేసుకున్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమలలో వివాహం చేసుకోవాలంటే తల్లిదండ్రుల అంగీకార పత్రాలు తప్పనిసరి. కాగా.. వధువు కవిత తరపున పెద్దలు ఈ పెళ్లికి నిరాకరించడంతో నకిలీ పత్రాలు సృష్టించి దొంగ తల్లిదండ్రులతో పెళ్లి తతంగాన్ని ముగించాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఈ విషయం బయటకు పోక్కడంతో కవిత తల్లిదండ్రులతో పాటు పోలీసులు రంగప్రవేశం చేశారు. దాంతో పెళ్లి పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. కాగా.. గతంలో కవితకు వేరే వ్యక్తితో వివాహం అయినట్లు తెలుస్తోంది.
.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more