మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడో తెలియదంటూ కేంద్ హోంమంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. కాగా కేంద్ర హోం మంత్రిత్వ వాఖ్యలపై ముంబై మాజీ పోలీసు కమిషనర్ ఎంఎన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన ప్రకటనను పెద్ద తప్పుగా ఆయన వర్ణించారు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ రక్షణలో దావూద్ ఉన్నాడని మన నిఘా సంస్థలు నెత్తినోరు కొట్టుకుంటుంటే, అతడి ఆచూకీ గురించి తెలియదని కేంద్రం ప్రకటన చేయడం పెద్ద తప్పు అని పేర్కొన్నారు. దావూద్ ను ఐఎస్ఐ మట్టుబెట్టే అవకాశం లేకపోలేదన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఐఎస్ఐ ప్రత్యక్ష పర్యవేక్షణలో పాకిస్థాన్ లోనే దావూద్ తలదాచుకున్నాడని ఎంఎన్ సింగ్ స్పష్టం చేశారు.
కాగా, దావూద్ ఇబ్రహీం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో వివరాలేమీ తమకు తెలియదని మంగళవారం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకుగాను హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి హరీభాయి పరాటీభాయి చౌదరి ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దావూద్పై యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి సైతం తమకు నోటీసులు అందాయని తెలిపారు. 1993 ముంబయి వరుస పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న అతని కోసం రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరీభాయ్ తెలిపారు. ఇప్పటి వరకు దావూద్ జాడ కనుగొనలేదని స్పష్టం చేశారు. దావూద్ను పట్టుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, అయితే ఇందుకు పాకిస్థాన్ నుంచి సరైన సహకారం అందడం లేదని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more