వట్టి మాటలు కట్టి పెట్టోయ్.. గట్టి మేల్ తల పెట్టోయ్ అని మహాకవి గురజాడ అన్నమాటలను తుంగలో తొక్కుతున్నారు ఓ కేంద్ర మంత్రి. చేతలు కాదు కానీ కేవలం మాటలు మాత్రమే అంటున్నారు సదరు మంత్రి వర్యులు. ఇంతకీ ఎవరా మంత్రి అనుకుంటున్నారా.. కేంద్ర ప్రభుత్వంలో ప్రతిపక్షాలపై మాటల తూటాలతో గుక్కతిప్పకోనివ్వని మన పార్లమెంటరీ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గురించే ఇంత చెప్పింది. అసలు విషయం ఏమిటంటే వెంకయ్య నాయుడు కేవలం మాటలకు మాత్రమే పరిమితమవుతున్నారని.. తన స్వంత శాఖ పని తీరును కూడా బాగుచెయ్యడంలో వెనుకబడ్డారని పార్లమెంటరీ స్థాయి సంఘం మండిపడింది. స్వంత శాఖను ముందు బాగుచేసుకోవాలని.. పని తీరును మార్చుకోవాలని స్థాయి సంఘం హితవు పలికింది.
కేంద్ర పట్టణాభివృద్ది శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ రెండింటిని బిజెపి ఎంపీ ఎం. వెంకయ్యనాయుడు నిర్వహిస్తున్నారు. అయితే తన పట్టణాబివృద్ది శాఖ పని తీరుపై పార్లమెంటరీ స్థాయి సంఘం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెంకయ్య నాయుడు పని తీు ఎంత దారుణంగా ఉందో తేలింది. పట్టణాభివృద్ది శాఖలో ఆర్భాటం ఎక్కువ ఆచరణ తక్కువ అని ఏకంగా పార్లమెంటరీ స్థాయి సంఘం మండిపడింది. 2022నాటికి అందరికి ఇళ్లు, జాతీయ జీవనోపాధి మిషన్, రాజీవ్ ఆవాస్ యోజన లాంటి పథకాలను కేంద్ర పట్టణాభివృద్ది శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చూస్తోంది. కానీ 2022 నాటికి అందరికి ఇళ్లు పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినా ఇంత వరకు విధివిధానాలను పట్టణాభివృద్ది శాఖ ఇప్పటి వరకు ఖరారు కాలేదు. రాజీవ్ ఆవాస్ యోజనకు నిధులు కేటాయించలేదని, దానికి బదులుగా అందరికి ఇళ్లు పథకాన్ని అమలు చేస్తామని చెప్పినా ఇంత వరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. మొత్తానికి మాటలతో కాలం గడపకుండా చేతలు చేసి చూపిచాలని బిజెపి ఎంపీ పినాకి మిశ్రా నేతృత్వంలొని బృందం సలహా ఇచ్చింది. కనీసం ఇప్పటికైనా మంత్రి గారు నోటికి పని తగ్గించి.. పని మీద దృష్టి పెడతారో లేదో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more