టెలీ కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు.. అభివృద్దికి ఎంతో దోహదపడుతున్నాయో.. అదే స్థాయిలో వాటిని వినియోగించి నేరాలకు పాల్పడేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. నేరగాళ్లు సరికోత్త వ్యూహాలు, పద్దతుల ద్వారా నేరాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రస్తుతం నగరీకరణ ప్రాంతాలతో పాటు పల్లెభారతంలోనూ సామాజిక మీడియా, సెల్ ఫోన్లలో అసభ్య సందేశాలను పంపడం వంటి నేరాలు నమోదవుతున్నాయి. ఇలాంటి కేసుల దర్యాప్తు పోలీసులకు పెద్ద సవాలుగా మారుతోంది.
సామాజిక మీడియాలో నమోదవుతున్న నేరాలను కట్టడి చేయడానికి పోలీసులు ప్రత్యేకృదష్టి పెట్టనున్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల నుంచి రాజధాని నగర పోలీసులో మెరికల్లాంటి 15 మంది అధికారులను ఎంపిక చేసి వారికి ఢిల్లీలో శిక్షణను ఇచ్చారు. గత పదిహేను రోజులగా పెలైట్ ప్రతిపాదికన నగర పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక ల్యాబ్లో సోషియల్ మీడియాల పనిపట్టడంలో నిమజ్ఞమై ఉన్నారు.
సోషియల్ మీడియా ద్వారా ఎవరు, ఎప్పుడు, ఎక్కడ నుంచి సమాచారాన్ని రవాణా చేస్తున్నారన్న విషయంతో పాటు నిర్ధిష్ట విషయం అప్లోడ్ అయిన వెంటనే కనుగొనడానికి కొన్ని ప్రత్యేక విధానాలు, ప్రత్యేక సాఫ్ట్వేర్ను పోలీసులు సమకూర్చుకుంటున్నారు. ఇందుకోసం ‘సోషియల్ మీడియా మానిటరింగ్ ల్యాబ్’ను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా హాకింగ్ నుంచి తప్పించుకోవడానికి వీలవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఉన్న నిబంధనలను అనుసరించి ఫిర్యాదు అందిన తరువాత కేసులు నమోదు చేసేందుకు బదులు మానిటరింగ్ ల్యాబ్ సహకారంతో సుమోటోగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేయడానికి అవకాశం కలుగుతుంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more