కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఇంట్లో పోలీసులు సోదాలు జరపడపై పార్లమెంట్ వేడెక్కింది.రాహుల్ గాంధీ వ్యక్తిగత వివరాల సేకరణపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జెడ్ప్లస్ భద్రత ఉన్న వ్యక్తి నివాసానికి సమాచారం లేకుండా ఢిల్లీ పోలీసులు ఎలా వెళ్తారని గులాంనబీ ఆజాద్ రాజ్యసభలో ప్రశ్నించారు. దీనిపై ఢిల్లీ పోలీసులు తీరుపై సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాహుల్గాంధీ కావచ్చు..మరే ఇతర వ్యక్తులపైనైనా కావచ్చు, గూఢచర్యం ద్వారా రాజకీయపార్టీలను భయపెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. గత ఆగస్టు నుంచి దేశంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. మతస్వాతంత్య్రం తగ్గిపోవడమేకాకుండా ఇప్పుడు రాజకీయ స్వాతంత్య్రం కూడా దిగజారుతోందని మండిపడ్డారు. ఈ పరిస్థితిపై హోంమంత్రి సభలో ప్రకటన చేయాలని కోరారు. ఎందుకంటే ఈ అంశం కేవలం ఏ ఒక్క వ్యక్తికో సంబంధించిన విషయం కాదని.. ఈ విధానం వ్యక్తిగత స్వేచ్ఛకు అవరోధమే కాకుండా ప్రజాస్వామ్యానికే ఓ గొడ్డలిపెట్టు లాంటిదని తెలిపారు.
రాహుల్ వివరాల సేకరణ గూఢచర్యం కాదన్నారు. ప్రముఖుల వివరాల సేకరణ భద్రతకు సంబంధించిన పారదర్శక ప్రక్రియలో భాగమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ సంప్రదాయం 1987లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని తెలిపారు. వివరాల సేకరణ పత్రాన్ని 1999లో మార్చారని..అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్డీఏ ప్రభుత్వమా, యూపీఏ ప్రభుత్వమా అని చూడకుండాఢిల్లీ పోలీసులు ప్రతీ ప్రముఖుల ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తున్నారని ఉద్ఘాటించారు. ఇప్పటివరకు వివరాలను సేకరించే వారి జాబితాలో 526 మంది ఉన్నారన్న విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీ పోలీసుల శాఖలోని ప్రత్యేక విభాగం వివరాల సేకరణను పారదర్శకంగా చేస్తుందని దీనికీ, గూఢచర్యంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more