రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చేపట్టాల్సిన ప్రాజెక్టుల అమలుకు తీసుకొంటున్న చర్యలపై కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పలువురు కేంద్ర మంత్రులతో ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరిపారు. విభజన చట్టంలోని వివిధ ప్రతిపాదనలకు సంబంధించిన పురోగతిని, తాజా పరిస్థితిని కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో వివరించినట్లు సమాచారం. విభజన చట్టానికి అనుగుణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టుల అంశాన్నే తప్ప ఈ ఉన్నతస్థాయి సమీక్షలో ఆంధ్రప్రదేశ్కు అవసరమైన ప్రత్యేక హోదా, విభన తరువాతి మొదటి సంవత్సరంలో మొత్తం రెవెన్యూ లోటును భర్తీ చేయడం, రాజధాని నగర నిర్మాణ వ్యయాన్ని భరించడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చిన దాఖలాలే కనిపించలేదు. అలాగే, వెనుకబడిన ప్రాంతాల సత్వర, సర్వతోము ఖాభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు ప్రకటించాల్సిన అంశం, పారిశ్రామికీరణను ప్రోత్సహించేందుకు వివిధ పన్ను రాయితీలు, పెట్టు బడి ప్రోత్సాహకాలను ప్రకటించే విషయం కూడా ఈ సమావేశంలో సమీక్షకు నోచుకోలేదు.
రాష్ట్ర విభజన పర్యవసానంగా తొలి ఏడాదిలో దాదాపు 16,500 కోట్ల రెవెన్యూ లోటుతో ఆంధ్ర ప్రదేశ్ కష్టాల్లో ఉంది. ఏపిని ఆదుకునేందుకు తొలి ఏడాది లోటు ను పూర్తిగా కేంద్రమే భర్తీ చేయాల్సి ఉంది మరో పదిహేను రోజుల్లో తొలి ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నా, కేవలం 500 కోట్లను తాత్కాలిక సహాయంగా విడుదల చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మిగిలిన నిధుల విడుదల అంశాన్ని పూర్తిగా దాటవేస్తున్నట్లు కనిపిస్తోంది. విభజన చట్టం అమలు, రెండు రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్టుల అమలుకు తీసుకొంటున్న చర్యలపై ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రివర్గ సభ్యులైన దాదాపు 35మంది వరకూ పాల్గొన్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వర్గాలు వెల్లడించాయి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more