హస్తిన అసెంబ్లీ ఎన్నికలలో మోదీ ప్రభుత్వ ఓటమి అన్ని రాజకీయ పార్టీలకు ఒ వార్నింగ్ లాంటిదని ప్రముఖ భారతీయ నవలా రచయిత, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు కృష్ణ ప్రతాప్ సింగ్ అభివర్ణించారు. మోదీ ఓటమి ప్రతి ఒక్కరికి ఓ హెచ్చరిక లాంటిందని తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వ హనిమూన్ యాత్రకు భారతీయ ఓటర్లు అందునా ముఖ్యంగా హస్తిన ఓటర్లు చరమగీతం పాడారని చెప్పారు. రాజకీయ పార్టీలు ఏ విధంగా ప్రజల పట్ల వ్యవహారించాయో... ఫలితాలు ఆ విధంగా వచ్చాయని పేర్కొన్నారు. అవినీతిని ఇంకా ప్రజలు భరించరని, ప్రజలకు తలచుకుంటేనే ఇలాంటి ఫలితాలు సృష్టించబడతాయన్నారు.
శనివారం న్యూఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కృష్ణ ప్రతాప్ సింగ్ రాసిన ఓ కథనం న్యూయార్క్ టైమ్స్లో ప్రచురితమైంది. ఇటీవల ఆవిర్భవించిన పార్టీ ఇంతటి ఘన విజయం నమోదు చేసుకోవడం శుభ పరిణామన్నారు. ఈ విజయం పార్టీ మొత్తానికి చెందుతుందన్నారు. జేపీ బిగ్ మనీ, బిగ్ ర్యాలీల కంటే ఆప్ చేపట్టిన గల్లీ గల్లీ ప్రచారం, గడప గడపకు ప్రచారం మంచి ఫలితం ఇచ్చిందన్నారు. భారత్ లో ఆప్ ఘన విజయం దేశ రాజకీయాల్లో సరికొత్త కీలక మలుపు అని పేర్కొన్నారు.
దేశ రాజధాని ప్రజల వైఖరి ఎలా ఉంటుందో... ఆ జాతి వైఖరి కూడా అలా ఉంటుందని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పేర్కొన్నారు. కానీ ప్రజలు బాగా తెలివైన వాళ్లు... ఎవరు సరైన రాజకీయ నాయకులో... ఎవరు కాదో ఇట్టే పసిగట్టేస్తారన్నారు. నేడు ప్రతి ఒక్కరి వద్ద సమాచారం వారి జేబుల్లోని సెల్ ఫోన్లలో సంక్షిప్తమై ఉంటాయని చెప్పారు. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన హామీలను అమలు పరచాలని ఆప్ నేతలకు కృష్ణ ప్రతాప్ సింగ్ హితవు పలికారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more