పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. తాజాగా విడుదలైన ‘గోపాల గోపాల’ సినిమా సక్సెస్ దిశగా రాకెట్ వేగంతో దూసుకెళ్ళటం ఖాయంగా తెలుస్తోంది. ఉదయం ఆటకు ముందే చాలా చోట్ల ప్రీమియర్, బెనిఫిట్, మిడ్ నైట్ షోలు ప్రదర్శించారు. తొలి షో సినిమా చూసిన అభిమానులు పవన్ ఫీవర్ లో మునిగిపోయారు. భజే భాజే అంటూ ఉర్రూతలూగుతున్నారు. థియేటర్లోనే సంక్రాంతి సంబరమంతా కన్పిస్తోంది. సినిమాలో పవన్ రోల్ తక్కువ సమయం ఉన్నప్పటికీ... ఫ్యాన్స్ మాత్రం సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సినిమాకు వెంకటేష్ ఫ్యాన్స్ కంటే పవన్ అభిమానుల కోలాహలమే ఎక్కువగా ఉంది. ఆయన అభిమానుల వల్లే ఇంత హిట్ టాక్ పొందుతోంది అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన టాక్ విన్పిస్తోంది. పవన్ సినిమా టికెట్ల కోసం టీడీపీ కార్యకర్తలు ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ అయితే చాలా కష్టపడుతున్నారట. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు కోనసీమ ప్రాంతంలో బాలయ్య ఫ్యాన్స్ టికెట్ల కోసం పెద్ద ఎత్తునే పైరవీలు చేస్తున్నారట. తొలి మూడు రోజులకు టికెట్లన్నీ బుక్ కావటంతో ఎలాగైనా సినిమా చూసేందుకు అవకాశం కల్పించాలని డిస్ర్టిబ్యూటర్లు, తెలిసిన పెద్దలను కలుస్తున్నారట. ఇంకొందరయితే తమ పలుకుబడి ఉపయోగించి ఏకంగా నిర్మాత సురేష్ బాబును సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ కూటమి తరపున ప్రచారం కూడా చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ఫ్యాన్స్ కు కూడా పవన్ అంటే సాఫ్ట్ కార్నర్ ఉంది. దీంతో పవన్ సినిమాపై వీరికి కూడా క్రేజ్ ఏర్పడింది. ఇండస్ర్టీ అంతా కులం, వర్గం, ప్రాంతం అంటూ విడిపోయిన సమయంలో ఒక హీరో సినిమా కోసం మరో హీరో అభిమానులు పైరవీ చేయటం అంటే అది పవన్ కే చెల్లింది. హ్యాట్సాఫ్ అటు పవర్ స్టార్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more