తెలంగాణలో విద్యుత్ సమస్యలపై మంత్రి హరీష్ రావు బృందంలోని ఎంపీల బృందం కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను అశ్రయించిన నేపథ్యంలో మంచి ఫలితాలే వస్తున్నాయ్. ఓ వైపు కేంద్రమంత్రి ఉమాభారతి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని సూచించాగా, మరోవైపు రాష్ట్ర పునర్ విభజన బిల్లు మేరకు తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాను ఇవ్వలేదని చెప్పిన నేపథ్యంలో పియూష్ గోయల్.. ఇద్దరు ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలుస్తామని చెప్పడంతో ప్రస్తుతం పరిస్తితులు వాటంత అవే సద్దుమణుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా అలస్యంగా తెలంగాణలోని విద్యుత్ సమస్య ఉదృతి అర్థమయ్యిందట., అసలది సమస్యే కాదంటున్నారు. ఒక వేళ సమస్యగా పరిగణించాల్సి వస్తే.. అది చాలా చిన్న సమస్యగా చూడాలంటున్నారట. ఇరు రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే ఒకరికొకరు సహకరించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఏ రాష్ట్రమైనా పొరుగు రాష్ట్రాలతో మంచి సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలని ఆకాంక్షించారు. అయితే ఇవాన్నీ ఆంద్రప్రదేశ్ లో చెప్పిన మాటాలు కాదట. మరో పోరుగు రాష్ట్రం కర్ణాటకలో ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు.
బెంగళూరులో న్యూటనిక్స్ ఐటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. అనంతరం మాట్లాడుతూ.... నవ్యాంధ్రలో పరిశ్రమలు, ఐటీ సంస్థల విస్తృతికి మంచి అవకాశాలున్నాయని అన్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ చిత్రపటంలో నిలిపామని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే నవ్యాంధ్రలోని కూడా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలోని విజయవాడ అద్భుత నగరం, తిరుపతి ఆధ్యాత్మిక నగరమని చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో క్లౌడ్ కంప్యూటరింగ్ ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పుకు నాంది అని అన్నారు. ఇటీ సాయంతో సంక్షేమ పథకాల అమలులో అనర్హులను ఏరివేస్తామని చెప్పారు. ఇంత చెప్పారు కానీ తెలంగాణకు విద్యుత్ ఇస్తారా..? లేదా..? అన్నది మాత్రం చంద్రబాబు స్పష్టం చేయలేదు.
ఒకవైపు విద్యత్ ఇబ్బందులతో తెలంగాణలోని రైతులు చేతికందిన పంట.. ఇంటికి రావడంలేదన్న భాధతో అత్మహ్యతలు చేసుకుంటుంటే.. దానిని చిన్న సమస్యగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిగణించడాన్ని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more