అమ్మవారి అష్టాదశ పీఠాల్లో ఒకటైన ఇంద్రకీలాద్రికి దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని భక్తుల తాకిడి ఎక్కువైంది. పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులకు అక్కడి ఆలయ అధికారులు చుక్కలు చూపెడుతున్నారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సరైన ఏర్పట్లు చేయని అధికారులు వారిని ఎండలోనే రోడ్లపైనే పడిగాపులు కాశేలా చేస్తున్నారు. ఎండ తీవ్రంగా వుండడంతో వడదెబ్బకు మహిళలు వృద్దులు, పిల్లలు సోమ్మసిల్లి పడుతున్నారు. 100కు పైగా భక్తులు అస్పత్రుల్లో చికిత్స పోందుతున్నారంటే అక్కడి ఏర్పాట్లు ఏ మేరకు జరిగాయో ఇట్టే అర్థమవుతుంది.
మరోవైపు అక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఏర్పాటు చేసిన సీఐ ప్రసాద్ మాత్రం హ్యాపీగా ఓ పక్కన కూర్చొని తన ఫోన్ లో వీడియోలను చూస్తున్నారు. ఇందులో ట్విస్ట్ ఏముంది..? అంటారా..? అతను చూస్తున్నది మామూలు విడీయోలు కాదు.. తన ఫోన్లో అప్ లోడ్ చేసుకున్న నీలి చిత్రాలు. పవిత్ర నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో.. అష్టాధశ శక్తిపీఠాల్లో ఒకటైన విజయవాడ ఇంద్రకీలాద్రి అలయంలో.. వేద మంత్రాలు, నిత్యం అమ్మ నామస్మరణలు వినబడాల్సిన చోట.. ఫోన్ లో వీడియోలు చూస్తున్నాడు సి.ఐ. ప్రసాద్
ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే ఈ ఆలయంలో నీలి చిత్రాలు చూస్తూ సిఐ మీడియా కంట పడ్డాడు. ఇంకేముంది... సి.ఐ తతంగాన్నంతా చిత్రీకరించిన మీడియా.. ఆ తరువాత దాన్ని కథనాలను ప్రసారం చేసింది. ఆంధ్రపద్రేశ్ డీజీపీ రాముడు మీడియా కథనాలపై స్పందించారు. సిఐపై తక్షణం సస్పెన్షన్ వేటు వేసింది. అంతే ఇక మన భక్తులు ఊరుకోరు కదండీ.. ఇక్కడ అమ్మవారు వున్నారని ఈ సంఘటనే సాక్షమంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక మరికొందరు సిఐ ప్రసాద్ కు తగిన శాస్తి జరిగిందని సంబరపడుతున్నారు. ఏది ఏమైనా అమ్మవారి ఆలయంలో అపచారపు పనులు చేస్తే పరిణామాలు ఇలానే వుంటాయంటున్నారు భక్తులు
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more