ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ జెడ్ స్పీడ్ తన పరిపాలన సాగిస్తున్నాడు. అయితే మోడీ పెట్టే వాతలకు.. దేశంలోని గవర్నర్లు ..పిట్టలా రాలిపోతున్నారు. కేంద్రంలో ప్రభుత్వం మారటం, గవర్నర్లకు కష్టాలు రావటంతో మాములే. కానీ పాత గవర్నర్లు తప్పుకుంటే.. కొత్తవారికి అవకాశలు వస్తుంటాయి. అయితే ఇలాంటి సమయంలో.. మోదీ దూకుడు చూసిన కొంత మంది గవర్నర్లు స్వయంగా రాజీనామా చేసి తప్పుకుంటున్నారు.
ఎన్టీయే ప్రభుత్వం రాకతో.. యూపీఏ లో పదవి పొందిన గవర్నర్లు పదవి దిగిపోతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కొంత మంది రాజీనామా చేసి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే మోడీ మాత్రం పదవి సమయాన్ని బట్టి గవర్నర్లపై వాతలు పెడుతున్నట్లు రాజకీయ నేతల్లో చర్చలు బలంగా జరుగుతున్నాయి. యూపీఏ గవర్న మెంట్ సమయంలో సోనియాగాంధీ సహకరంతో గవర్నర్లు అయిన వారికి గుండెల్లో మోడీ భయం పట్టుకుంది. అంతేకాకుండా ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్యస్వామి హెచ్చరికతో గవర్నర్లు రాజీనామా బాట పట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ బిఎల్ జోషి, అసోం గవర్నర్ బేబీ పట్నాయక్ ఈరోజు రాజీనామా చేసారు. మరో ఇద్దరు గవర్నర్లు పశ్చిమ బెంగాల్ నుంచి ఎమ్ కే నారాయణన్, రాజస్తాన్ గవర్నర్ మార్గరెట్ అల్వా లు లైన్లో ఉన్నారు. మరో ముగ్గురు గవర్నర్ లు త్వరలో రాజీనామాలు చెయ్యనున్నారని సమాచారం. అందులో కేరళ గవర్నర్, మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా ఉన్నారని సమాచారం.
అయితే కేరళ గవర్నర్ మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మాత్రం మోడీ ప్రభుత్వానికి సవాల్ విసురుతుంది. ఆమెకు గవర్నర్ పదవి ఉడిపోతే.. పాత కేసులు ఆమెను చుట్టుముడతాయనే భయం షీలా దీక్షిత్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే షీలా దీక్షిత్ పై మోడీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more