మధ్య అమెరికాలో ఎల్ సాల్వేడర్, నికార్గువా, కోస్టా రికా లలో చెరుకు పంట ఉన్న ప్రాంతంలో పని చేసే వ్యవసాయ కార్మికులను ఒక వింత జబ్బు పట్టుకుంది. ఈ సంగతి అందరికీ అర్థమవటానికి కూడా చాలా కాలం పట్టింది. గత రెండు దశాబ్దాలలో 20000 మందికి పైగా అకాల మరణానికి లోనయ్యారు. కొందరిని ఆ వ్యాధి పని చెయ్యలేని స్థితిలోకి పోయారు.
జువాన్ సెల్గాడో అనే యువకుడు 1966 లో తన 16 సంవత్సరాల ప్రాయం నుంచి చెరుకు తోటలో పనిచేస్తూవస్తున్నాడు. అయితే 35 సంవత్సరాల తర్వాత అతనికి వ్యాధి సోకిందని అర్ధమైంది. వ్యాధి ఏమిటో తెలియదు కానీ అది కిడ్నీ మీద తన ప్రతాపం చూపిస్తోంది. ముందు వ్యాధి లక్షణాలు జ్వరం, తలనొప్పి, ఆకలి మందగించటంతో మొదలవుతుంది. కారణమేమిటో తెలియకుండానే కిడ్నీలు పాడవటం మొదలవుతాయి. 65 సంవత్సరాలకు వచ్చిన సెల్గాడో తన తోటివారంతా చనిపోయిన సంగతి చెప్పుకొచ్చాడు.
మూలమేమిటో తెలియని మూత్రపిండాల దీర్ఘకాల వ్యాధి అని అన్నారు శాస్త్రవేత్తలు ఈ వ్యాధిని. దేనివలన ఈ వ్యాధి సోకుతోందో అర్థం కాలేదింకా. చక్కెర వ్యాధి కాదు, రక్తపోటు వలన కాదు. ఈ వ్యాధి యుక్తవయసులో ఉన్నవారికే సోకుతోంది. బహుశా ఒకటి కాకుండా ఎన్నో కారణాలు మిళితమైన ఈ వ్యాధిని కలిగిస్తున్నాయని కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే వాటిలో ఒకటి కూడా అర్థం కాలేదు కానీ అందరిలోనూ సమానంగా కనిపించింది వాళ్ళు చేస్తున్న వృత్తి. అదే చెరుకు తోటలో పనిచెయ్యటం.
సెల్గాడో గ్లేజర్ అనే అతనితో కలిసి 2008 లో చెరుకుతోటలో పనిచేసే వారికి సంప్రాప్తిస్తున్న ఈ వ్యాధి గురించి పరిశోధించటానికి లా ఇస్లా ఫౌండేషన్ ని స్థాపించాడు. చెరుకుతోటలో పనిచేసేవారి ఆరోగ్య పరిరక్షణ, ఈ వింత వ్యాధి సోకకుండా తీసుకునే జాగ్రత్తల విషయంలో పనిచెయ్యటమే ఆ సంస్థ ఉద్దేశ్యం.
నికార్గువా సుగర్ ఎస్టేట్స్ లిమిటెడ్ అధికార ప్రతినిధి గ్రేనెరా సాకాసా మాట్లాడుతూ, చెరుకుతోట పనికి, ఈ వ్యాధికి ఉన్న సంబంధాన్ని ఇంతవరకు ఎవరూ నిర్ధారించలేకపోయారు, అందువలన మా కంపెనీకి ఈ అకాల మరణాలకు మధ్య ఉన్న సంబంధాన్ని కూడా నిర్ధారించి చెప్పలేమని అన్నారు.
అమెరికాలో సామాన్యంగా కిడ్నీ దీర్ఘకాల వ్యాధితో బాధపడేవారు 70 నుంచి 80 సంవత్సరాల వయసులో ఉంటారు. కానీ మధ్య అమెరికాలో 20 నుంచి 30 సంవత్సరాల ప్రాయంలో ఈ వ్యాధిసోకుతోంది, 40 నుంచి 50 సంవత్సరాల వరకు వాళ్ళు మృతిచెందుతున్నారు. వ్యాధి సోకటానికి ముందుగా ఎటువంటి సూచనలు ఉండవు. కిడ్నీ వ్యాధితో సంబంధమున్న నొప్పి, పోటు కాని, రక్తపోటు కాని ఇలాంటి లక్షణాలేమి ముందుగా కనపడవు. ఈ వ్యాధి 5 అంచెలలో పెరుగుతూపోయి చివరకు ఐదవ స్టేజ్ లో ప్రాణాంతకంగా మారుతుంది. చెరకుతోటలో పనిచేసేవారిలోనే 20 శాతం మంది ఈ వ్యాధిబారినపడటం విశేషం. అందువలన చెరకుతోటలో పనిచేసే విధానంలోనే ఎక్కడో దీనికి కారణం కనపడాలని పరిశోధకులు శోధిస్తున్నారు.
అక్కడి వాతావరణంలోని శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించే లక్షణం కూడా కారణం కావొచ్చని కూడా కొందరు భావిస్తున్నారు. డిహైడ్రేషన్ వలన కూడా కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది కానీ ఈ విషయం ఇదమిద్ధంగా ఇంకా రూఢి కాలేదు.
చెరుకుతోటలో పనిచేస్తున్నవారికే ఈ వ్యాధి సోకుతుండటం వలన ఆ సంస్థలు రిసెర్చ్ మీద బాగా ఖర్చుపెట్టవలసివస్తోంది. అయితే, అలా అవే సంస్థల తరఫునుంచి కాకుండా స్వతంత్రంగా పరిశోధన చేస్తేనే నిష్పక్షపాతంగా కారణాలను వెల్లడించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా తరతరాలుగా ఇంకా అక్కడే ఎందుకు పనిచేస్తున్నారూ అంటే వేరే ఏం చెయ్యాలో తెలియక అంటున్నారు సెల్గాడో. అక్కడ ఉన్నదంతా చెరుకు వ్యాపారమే. ఆయన పదవీవిరమణ తర్వాత ఆయన ముగ్గురు కొడుకులూ అక్కడే పనిచేస్తున్నారు. వాళ్ళు 26,29, 33 సంవత్సరాల వయసులో ఉన్నారు. తనకి ఆ వ్యాధి సోకలేదు కానీ వాళ్ళ ఆరోగ్యం విషయంలోనే తనకి ఆదుర్దాగా ఉందని సెల్గాడో అన్నారు. తన కొడుకుల తోటివాళ్ళల్లో చాలా మంది అక్కడ పనిచెయ్యలేక వెళ్ళిపోయారట. కానీ వ్యాధి నుంచి దూరంగా కాదు. వ్యాధి సోకటం వలన నీరసించి పనిచెయ్యలేక. వాళ్ళల్లో చాలామంది మృత్యువుకి సమీపంలో ఉన్నారని కూడా చెప్తూ సెల్గాడో తన బాధను వ్యక్తం చేసారు.
ఇప్పటికీ ఆ వింత వ్యాధికి కారణం కానీ దానికి పరిష్కార మార్గం కానీ లభించకపోవటం విచారకరం. ఇప్పటికీ ఆ వింత వ్యాధికి కారణం కానీ దానికి పరిష్కార మార్గం కానీ లభించకపోవటం విచారకరం. వ్యాధికి పేరైతే పెట్టలేదు కానీ, ఆ ప్రాంతానికి వితంతువుల దీవి (ది ఐలెండ్ ఆఫ్ విడోస్) అని పేరు పెట్టారు. ఎందుకంటే ఈ వ్యాధి చెరుకుతోటలో పనిచేస్తున్న మగవారికి మాత్రమే సోకి వాళ్ళ భార్యలను విధవలను చేస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more