ఎన్నికలు సజావుగా సాగటం కోసం పనిచేసే ఎన్నికల కమిషన్ ఆ దిశగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు కొత్త నియమాలు, నిఘాలతో కట్టుదిట్టం చేస్తున్నా, ఎన్నికల కమిషన్ కి అన్నిటికన్నా పెద్ద సవాల్ నోటు రాజకీయమే. ఈ విషయాన్ని ఎన్నికల కమిషనర్ హరి శంకర్ బ్రహ్మ బుధవారం నాడు ఎంతో ఆవేదనతో తెలియజేసారు.
సొమ్ము రవాణాలో ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం. ఇంతవరకు తరలిస్తున్న డబ్బు పట్టుబడింది 80 కోట్లైతే, అందులో మనరాష్ట్రంలోనే 49.5 కోట్ల రూపాయలు.
ఎన్నికల కమిషన్ ఈ సారి అభ్యర్థుల చేసే గరిష్ట ఎన్నికల ఖర్చుని పెంచుతూ 70 లక్షలు చేస్తే అది కూడా సరిపోదని తమదగ్గర వాపోతున్నారని ఇసి అన్నారు. కనీసం 3 కోట్లైనా అవసరం పడుతుందని అభ్యర్థులు కొందరు సూచించారట. ఎన్నికలలో గెలవటానికి 35 కోట్లు ఖర్చుపెట్టటానికి ఒక నాయకుడు సిద్ధమౌతే, అంతకు మించి 100 కోట్లు పెట్టటానికి మరో అభ్యర్థి తయారయ్యారని సాక్షాత్తూ ఇసి చెప్పటం విశేషం.
ఎన్నికలలో డబ్బు కీలక పాత్రను వహించటమంటే ఎన్నికలు సజావుగా సాగనట్లే, వోటర్లను ప్రలోభానికి పడేసినట్లే. ఇవన్నీ పక్కకు పెడితే అసలు అంత ఖర్చు పెట్టటానికి ఎందుకు తయారవుతున్నారు. అంతకంత తిరిగి సంపాదించటానికే అన్నది తేటతెల్లంగా తెలుస్తూనేవుంది. అది కూడా ఐదు సంవత్సరాల కాలంలో కాదు- ఏ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో, ఎవరికి ఎంత కాలం అధికారం ఉంటుందో తెలియదు కాబట్టి సాధ్యమైనంత త్వరగానే తమ సొమ్మును లాభంతో సహా రాబట్టుకోవటానికే చూస్తారనటంలో సందేహం లేదు.
అంటే ఇది పూర్తిగా డబ్బులున్నవారి ఆటే. ఎన్నికల సమయంలో నాయకులకు సామాన్యుడు మాన్యుడే కానీ అసలు గేమ్ వేరే వుంది. కేవలం వోటర్లు పావులే. గెలుపు ఓటమిలతో వారికి ఎటువంటి సంబంధమూ ఉండదన్నిది అర్థమౌతోంది.
ఇంతకీ ప్రభుత్వం పెట్టే ఖర్చు ఎంతంటే సాధారణ ఎన్నికలకు 5 వేల కోట్లు, నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు వెయ్య కోట్ల రూపాయలట.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more