Namo tea stall in vijayawada inagurated by venkayya naidu

Vijayawada NaMo tea stall, BJP, Narendra Modi, BJP leader Venkayya Naidu, Bhago Jago call by TRS, Bhago Jago call by T Congress leaders

NaMo tea stall in Vijayawada inagurated by Venkayya Naidu

విజయవాడలో 'నమో టీ స్టాల్'

Posted: 01/29/2014 12:09 PM IST
Namo tea stall in vijayawada inagurated by venkayya naidu

విజయవాడ నగరంలో గాంధీనగర్ లో నమో టీ స్టాల్ ని ప్రారంభించిన భాజపా సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు స్వయంగా టీ కాచి వడపోసి మరీ అందరికీ ఇచ్చారు. 

ఆ సందర్భంలో మాట్లాడుతూ వెంకయ్యనాయుడు జాగో భాగో నినాదానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని అన్నారు.  2009 లో కెసిఆర్, దరిమిలా జూన్ 2013 లో కాంగ్రెస్ నేతలు చేసిన తెలంగాణావాలే జాగో, ఆంధ్రావాలే భాగో అన్న నినాదం సరైనది కాదని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. 

తెలంగాణా ప్రజలు మేలుకోవాలని, ఆంధ్ర నుంచి వచ్చిన వలసదారులు వాళ్ళ ప్రాంతాలకు తిరిగి వెళ్ళిపోవాలని చెప్పే జాగో భాగో ప్రస్తావన ఎత్తిన వెంకయ్యనాయుడు ఇటలీ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేసి పెత్తనం చెలాయించవచ్చు కానీ దేశంలో ఒక ప్రాంతం వాళ్ళు మరో ప్రాంతంలో ఉండగూడదా ఇది ఎంత అన్యాయం అని అన్నారు. 
అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పోయి భాజపా రావాలి, నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని వెంకయ్య నాయుడు అన్నారు. 

రాజకీయాలలోకి రాకముందు టీ స్టాల్ నడిపిన నరేంద్ర మోదీని ఎద్దేవా చేస్తూ మాట్లాడిన ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొడుతూ టీ దుకాణం నడిపిన మనిషి రాజకీయాల్లోకి రాగూడదని రాసుందా, మీకు అది బాధ కలిగిస్తోందా అంటూ మోదీ అలా అన్నవాళ్ళ నోరు మూయించారు.  అప్పటి నుండి చాయ్ వాలా పేరుని భాజపా కూడా ఉపయోగించుకోవటం మొదలుపెట్టింది.  అందుకే విజయవాడలోని టీ దుకాణానికి నమో (నరేంద్ర మోదీ) అని పేరు పెట్టటం, దాన్ని ప్రారంభించటానికి వెంకయ్యనాయుడు లాంటి సీనియర్ నాయకుడు వెళ్ళటం జరిగింది. 

ఇలాంటి టీ స్టాల్స్ ని భాజపా దేశవ్యాప్తంగా ప్రారంభించటం జరుగుతోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles