మధమెక్కిన మగ కామాంధుల కోసం ఎన్ని చట్టాలు తీసుకొని వచ్చినా ఏం లాభం లేదు. రోజు రోజుకు మహిళల పై, విద్యార్థినుల పై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో అత్యాచార సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాలలో విద్యా బుద్ధులు నేర్పి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ప్రిన్స్ పాల్ తొమ్మిదో తరగతి విద్యార్థిని పై అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సైదాబాద్ ప్రాంతంలోని వికాస్ భారతి పాఠశాల ప్రిన్సిపల్ తనను లైంగికంగా వేధించాడని బాలిక పిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నేరం రుజువైతే ఇతని పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు. గతంలో హైదరాబాద్ లోని పార్క్ వుడ్ స్కూల్ ప్రిన్స్ పాల్ కూడా విద్యార్థిని లైంగికంగా వేధించాడని ఆరోపనలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక మరో సంఘటనలో ఓ కామాంధుడు ప్రేమించాని చెప్పి రహస్యంగా పెళ్ళి చేసుకొని నాలుగు నెలలు సంపారం చేసి, ఆ నాలుగు నెలల కాపురంలో అమ్మాయి శీలానికి వెలకట్టి వదించుకోవాలని చూస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇల్లెందులో. ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం బొల్లినగర్కు చెందిన వెంకటేషం ఓ యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కానీ వెంకటేశం మేనమామ అభ్యంతరం చెప్పడంతో ఆమెను వదిలించుకునేందుకు పంచాయితీ పెట్టించాడు. దీంతో పెద్దలు యువతికి రూ. 2లక్షలు ఇప్పించేందుకు తీర్మానించారు. పంచాయితీ జరిగిన రెండు రోజుల తర్వాత ఆ యువతి తనకు భర్తే కావాలంటూ ఇల్లెందు పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more