కసబ్ ఉరి పట్ల నగరవాసి కుటుంబానికి ఉపశమనం కలిగిందట. నాలుగేళ్ల క్రితం ముంబైలో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన నగర వాసి విజయ్ రావు బాంజ కుటుంబ సభ్యులు కసబ్ ఉరి పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు తమ మనసులకు కాస్త ఉపశమనం లభించిందని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ నేరేడ్ మెట్ డిఫెన్స్ కాలనీకి చెందిన విజయరావు బాంజ ముంబై తాజ్ హోటల్ చీఫ్ చెఫ్ గా పనిచేసేవారు. దాడి జరిగిన ముందు రోజే హైదరాబాద్ నగరం నుంచి వెళ్లిన ఆయన ఉగ్రవాది కసబ్ మరణహోమంలో మరణించారు. విజయరావు మరణించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కసబ్ విషయంలో ప్రభుత్వం ఆలస్యంగానైనా తగిన నిర్ణయం తీసుకుందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావ్రుతం కాకుండా ఉగ్రవాద శక్తులను అణచివేసే విధంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more