హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు మొదటి పంపింగ్ స్టేషన్(పీఎస్)ను ఆదివారం సీఎం కిరణ్కుమార్ రెడ్డి ప్రారంభించిన తర్వాత రెవెన్యూ శాఖమంత్రి ఎన్.రఘువీరారెడ్డి భగీరథ విజయాత్రకు స్వీకారం చుట్టారు. మల్యాల నుంచి కాలువ వెంట ప్రారంభమయిన ఈ యాత్ర ఈ నెల 29 వరకు సాగనుంది. జీడిపల్లె రిజర్వాయర్ వరకూ 216.3 కిలోమీటర్ల మేర 12 రోజుల పాటు రఘువీరా యాత్ర సాగించి అనంతపురానికి నీటిని నడిపించనున్నారు. భగీరథ విజయాత్రలో భాగంగా ఎనిమిది పంపింగ్ స్టేషన్ల వద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. సీఎం ప్రారంభించిన పీఎస్ కాకుండా తక్కిన ఏడు పీఎస్లను ఒక్కో మంత్రి ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
దీంతో నాలుగు దశాబ్దాలుగా రాయలసీమ వాసులు కంటున్న కలలను ఈ ప్రాజెక్టు సాకారం చేయనుంది. మొదటి దశగా 216.3 కిలోమీటర్ల కాలువను, మూడు రిజర్వాయర్లు, ఎనిమిది పంపింగ్ స్టేషన్లను అధికారులు పూర్తి చేశారు. అందులో ఏడు పంపింగ్ స్టేషన్లు కర్నూలు జిల్లాలోనూ, అనంతపురం జిల్లా జీడిపల్లె వద్ద ఒక రిజర్వాయర్ నిర్మాణాలను పూర్తి చేశారు. హంద్రీనీవా మొదటి దశ ద్వారా కర్నూలు జిల్లాలోని 80 వేల ఎకరాలకు, అనంతపురం జిల్లాలోని లక్షా 18 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. రెండు జిల్లాల్లో 120 గ్రామాలకు చెందిన సుమారు 10 లక్షల మందికి తాగు నీరందనుంది. ఎనిమిది పంపింగ్ స్టేషన్ల వద్ద తగిన సామర్థ్యంతో కేవీ సబ్స్టేషన్లను ఏర్పాటు చేశారు
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more