పొగ తాగడం మాన్పించాలంటే సిగరెట్ ధరలను పెంచడమే ఉత్తమ మార్గమని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) చెబుతోంది. సిగరెట్ ధరలను 50శాతం పెంచడం వల్ల భారత్లో ఏటా 40లక్షల మరణాలను అరికట్టవచ్చని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అయితే దాదాపు 2.7కోట్ల మంది ప్రాణాలు కాపాడవచ్చట! యాభై శాతం ధరలను పెంచడం ద్వారా పన్నులతో కలిపి సిగరెట్ ధర దాదాపు రెట్టింపు అవుతుందని, దాంతో ఆ భారాన్ని తట్టుకోలేక చాలా మంది సిగరెట్ తాగడం తగ్గిస్తారని ఏడీబీ అంచనా వేసింది. పొగాకు ఉత్పత్తులన్నింటిపైనా పన్నులు పెంచే విషయంపై భారత్ దృష్టి సారించాలని సూచించింది. ఈ నిర్ణయం వల్ల పొగ తాగే పేదలపై భారం పెరిగినా... ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more