దేశంలో రైతులను అభివృద్ధి పథంలో నడిపించేందుకే ఎఫ్డీఐలను దేశంలోకి అహ్వనిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు. దేశం ప్రగతి పథంలో నడవాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజాసదస్సులో సోనియా మాట్లాడుతూ అవినీతిని వెలుగులోకి తీసుకరావటానికి తామే ఆర్టీఐ చట్టం తీసుకువచ్చామని..నిజాయితీలో తమతో ఎవరు పోటీ పడలేరని ఆమె పేర్కొన్నారు.
కాగా, అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విధానపరమైన నిర్ణయాలపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదన్నారు. తమ మొదటి ప్రాధాన్యత రైతులకు లబ్ధి చేకూర్చడం అని చెప్పారు. రైతుల్లో విశ్వాసం పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఎనిమిది కోట్ల మందికి లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఎఫ్డీఐల రాక అవసరమని చెప్పారు. ఎఫ్డీఐలు ప్రతి ఒక్కరికి మేలు కలిగిస్తాయన్నారు. ఉద్యోగ కల్పనకు ఆర్థిక సంస్కరణలు అవసరమన్నారు.
ఇక యువనేత రాహుల్ ఏమన్నారంటే.. పనిగట్టుకుని తమపై విపక్షాలు బురద జల్లుతున్నాయని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని పేర్కొన్నారు. వ్యవస్థ మార్పుకు విపక్షాలు సలహాలు ఇస్తే స్వీకరిస్తాం కానీ, రాజకీయాలు చేస్తే సహించమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది యూపీఏ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రతిసారి ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రైతులు, సామాన్యులకు మేలు చేస్తాయని తెలిపారు. సామాన్యులు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిని అంతమొందించేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సోనియాగాంధీ, మన్మోహన్సింగ్, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. జనాలతో రాంలీలా మైదానం కిక్కిరిసిపోయింది.
అయితే. ఈ సదస్సు మీద విపక్షాలు పెదవివిరిసాయి. అమెరికా లభాల కోసమే ఎఫ్డీఐలను స్వాగతిస్తు కాంగ్రెస్ పార్టీ ప్రజాసదస్సు నిర్వహించిందని బీజేపీ ఆరోపించింది. ప్రజాల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ ర్యాలీలతోలో బల ప్రదర్శనకు దిగుతోందని బీజేపీ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. ఎఫ్డీఐల వల్ల లక్షలాది మంది రోడ్డున పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 55 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశంలో పెరిగిన అవినీతికి సమధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎఫ్డీఐలని వ్యతిరేకించిన మన్మోహన్సింగ్, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇప్పుడు తామే ఎఫ్డీఐలను ప్రవేశపెట్టడం కాంగ్రెస్ నయవంచక వైఖరికి నిదర్శనమన్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more