తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. పార్టీ అధినేత ఆదేశాలను తొలుత ధిక్కరించిన రైల్వే మంత్రి దినేష్ త్రివేదీ తన పదవికి రాజీనామా చేశారు. రైల్వే మంత్రిగా తన తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన త్రివేదీ, ప్రయాణికుల ఛార్జీల పెంపుదలను ప్రకటించి అధినేత్రి ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన త్రివేదీ అంతకు ముందు అధినేత్రి మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడారు. తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, రాజీనామా చేస్తానని మమతకు చెప్పినట్లు సమాచారం. త్రివేదీని మంత్రి పదవి నుండి తొలగించాల్సిందేనని ప్రధానికి మమత హుకుం జారీ చేశారు. ఆ దిశగా ఆమె మరో అడుగు ముందుకేసి త్రివేదీ వారసుడిగా ముకుల్రారుని తమ అభ్యర్థిగా కూడా ప్రకటించేశారు. అయితే త్రివేదీ నుండి రాజీనామా కోరటంలో కాంగ్రెస్ పార్టీ ముందూవెనుకలు ఆలోచిస్తుండటంతో మమతాబెనర్జీ, ప్రధానికి 24 గంటల గడువు విధించారు.
త్రివేదీని పదవి నుండి తప్పించకపోతే పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రభుత్వానికి మద్దతునిచ్చే విషయం పునరాలోచించాలని మమత నిర్ణయించినట్లు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బంధోపాధ్యాయ మాత్రం పార్లమెంటరీ పార్టీ భేటీ ఎజెండా ఏమిటో తనకు తెలియదంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు. ప్రధానికి 24 గంటలు గడువు విధిస్తూ మమత జారీ చేసిన హెచ్చరిక కాంగ్రెస్లో కాక పుట్టించటంతో ప్రభుత్వ మనుగడకు మార్గాలను అన్వేషించే పనిలో మునిగి పోయింది ఆ పార్టీ నాయకత్వం. ఇందులో భాగంగానే నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్లో పగ్గాలను చేపట్టిన సమాజ్వాది పార్టీని ఆశ్రయించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నించింది. అవసరమైతే సమాజ్వాది పార్టీకి ప్రభుత్వంలో చోటు కల్పించేందుకు కూడా సిద్ధమైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజరుసింగ్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని ధృవీకరించాయి. కేంద్రంలో మారుతున్న సమీకరణాలకు కాంగ్రెస్ నాయకత్వ ప్రయత్నాలను సూచి కలుగా రాజకీయ పరిశీలకులు భావించినప్పటికీ పదవి నుండి వైదొలగాలన్న త్రివేదీ నిర్ణయంతో ఈ సంక్షోభం ప్రస్తుతానికి సద్దుమణిగినట్లే కనిపిస్తోంది
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more