కేంద్ర హోం శాఖ నుంచి తాజాగా వెలువడ్డ ఎన్ సి టి సి అధికారాల మీద కాంగ్రేసేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల నుండి వ్యతిరేకత వచ్చింది. నిఘా సంస్థ (ఇంటెలిజెన్స బ్యూరో) లో భాగమైన జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (నేషనల్ కౌంటర్ టెర్రరిజమ్ సెంటర్) కి కట్టబెడుతున్న అధికారాలు దేశంలోని ఫెడరల్ విధానానికి వ్యతిరేకమని అంటున్నవారిలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోది, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉన్నారు. వారికి తోడుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన విపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా అందుకు వ్యతిరేకతను చూపిస్తూ, ప్రధానమంత్రికి లేఖ రాసారు.
ఎన్ సి టి సి డైరెక్టర్ కి అసాంఘిక చర్యలు (వ్యతిరేక) చట్టం 1967 లోని సెక్షన్ 2 ఇ ప్రకారం, ఆయన కాని ఆయన దగ్గర పనిచేసే అధికారులు కాని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన ఇవ్వకుండానే, వారి అనుమతి కోరకుండానే, అరెస్ట్ లు చెయ్యటం కానీ, సోదాలు నిర్వహించటం కానీ చేసే హక్కులు ఇవ్వటం మీద కాంగ్రెస్ పాలనలో లేని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దానికి చంద్రబాబు కూడా మద్దతుగా నిలిచారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న బంధం మీద ప్రభావం చూపే ఇటువంటి చర్యలో ఇంత పెద్ద ఎత్తున అధికారాలను ఇచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలను కానీ నాయకులను కానీ సంప్రదించకపోవటాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి ఇది దారితీస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారంతో నడిచే ఫెడరల్ విధానానికి నష్టం కలిగిస్తుంది కాబట్టి, హోం మంత్రి ఈ ఆర్డర్ ని వెంటనే ఉపసంహరించుకోవలసిందని చంద్రబాబు కోరుతూ, తెలుగు దేశం పార్టీ భారత దేశ ఫెడరల్ సిస్టమ్ పరిరక్షణకు ఎప్పుడూ ముందుంటుందని అన్నారు.
ఎవరూ బయటకు చెప్పని భయమేమిటంటే, ఈ అధికారాలతో కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ ని తలపించే విధంగా వ్యవహరించటానికి దోహదం చేస్తుంది. వచ్చే ఎన్నికల ముందు ఎవరూ తలెత్తకుండా వారి తలల మీద కత్తిలా ఇది పనిచేసే అవకాశం చాలా ఉంది. ఇప్పటికే సిబిఐ, ఇడి లతో కొరడా ఝుళిపిస్తున్న కేంద్రం ఈ విశేష అధికారాలతో కాంగ్రెసేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల నాయకులను భయం అంచున ఉంచటానికి వినియోగిస్తుందేమోనని వారి అసలు భయం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more