నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా సోమవారం పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ, దేశం కోసం అసువులు బాసిన మహానేతను దేశం మర్చిపోయిందని, ఆయన జన్మదినాన్ని శలవుదినంగా ప్రకటించటం సబబని ఆమె అన్నారు. సుభాష్ చంద్రబోస్ 116 వ జన్మదినాన ఆయన విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించిన మమతా, జన్మదినం మనకు తెలుసు కానీ అంతటి మహానాయకుడి మరణదినం తెలియకపోవటం దురదృష్టకరమని అన్నారు. ఆయన మరణించిన దినం మనకు తెలిసేంతవరకూ మనమందరం ఈ విషయంలో సిగ్గుపడాల్సిందేనని ఆమె అన్నారు.
సుభాష్ చంద్రబోస్ పూర్వ నివాసం నేతాజీ భవన్ లో జరిగిన జన్మదిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇంకా, 1941లో ఈ నివాసం నుంచి బయలుదేరి వెళ్ళిన నేతాజీ బ్రతికున్నారో లేదో మనకు తెలియలేదని, శతాబ్దాలు దాటినా ఆ విషయమింకా తెలుసుకోలేకపోవటం సిగ్గుచేటని ఆమె అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more