మహాదేవి వర్మ.. హిందీ సాహిత్యంలో ఛాయవాద యుగానికి మూల స్తంభాలుగా భావించబడే నలుగురు సాహిత్యకారులలో ఆమె ఒకరు. ఆధునిక హిందీ కవిత్వంలో ఆమె అందించిన సేవలకుగాను ‘ఆధునిక మీరా’ అని ఆమెను అభివర్ణిస్తారు. స్వాతంత్ర్యానికి పూర్వం, తర్వాత దేశంలో నివసించిన ఈమె.. బహుళ సమాజంలో పనిచేసింది. ఆ సమయంలోనే దేశంలో అంతర్లీనంగా వున్న ఉద్వేగాలను, ఆక్రోదనలను చూసి.. తన కవిత్వాల ద్వారా అంధకారాన్ని పోగొట్టే దృష్టిని ఇవ్వటానికి ప్రయత్నించింది. ఈమె కేవలం తన కవితల ద్వారా చైతన్యం పరచడమే కాదు.. ఈమె సమాజోద్ధరణా పనులతోపాటు మహిళాచైతన్యం కోసం చేసిన కృషి చేసింది కూడా.
జీవిత విశేషాలు :
1907 మార్చి 26వ తేదీన బ్రిటీష్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఫర్రూఖాబాద్ లో గోవింద్ ప్రసాద్ వర్మ, హేమా రాణి దంపతులకు మహాదేవి జన్మించింది. అలహాబాద్ యూనివర్సిటీలో హైయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన అనంతరం 1929లో బీ.ఏ. పూర్తి చేసింది. ఆ తర్వాత 1933లో సంస్కృతంలో ఎం.ఏ. పూర్తి చేసింది. అధ్యాపకురాలిగా తన జీవితాన్ని ప్రారంభించిన ఈమె.. పదవీ విరమణ సమయానికి ప్రయాగ మహిళా విద్యాపీఠానికి ప్రధానాచార్యులైంది.
ఆనాడు సమాజంలో మహిళలకు అంతగా గౌరవం లభించేది కాదు. ఆడపిల్ల పుడితే భారంగా భావించేవారు. వారికంటూ స్వేచ్ఛాజీవితం వుండేది కాదు. సమాజానికి తలొగ్గి, సంస్కృతి-సంస్కారాలకు లొంగి, ఇంటిపట్టానే వుండేవారు. అటువంటి రోజుల్లో జన్మించిన ఈమె.. మహిళల అనుభవిస్తున్న ఆవేదనను చూసి చలించిపోయింది. ఈమె కూడా బాల్యంలో ఎన్నో కష్టాలు అనుభవించింది. అవే ఈమెను కవియిత్రిగా మార్చాయి అనవడంలో సందేహం లేదు. సాధారణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, ఆవేదనలు చూసి చలించిపోయిన ఆమె.. వాటిని కళ్లకు అద్దినట్లుగా కవిత్వాల రూపంలో అందరికీ తెలియజేసింది. ఈమె మానసిక క్షోభను ఎంత హృద్యంగా వర్ణించిందంటే.. ‘దీపశిఖ’లో అది ప్రతి మనిషి వేదనగా అందరి హృదయాలను హత్తుకుంది. అది పాఠకులను ఎంతో ప్రభావితం చేసింది. ప్రతిభావంతమైన కవయిత్రి, గద్య రచయితైన ఈమె.. సాహిత్య, సంగీతాల్లో నైపుణ్యంతోపాటు చక్కటి చిత్రకారిణి, సృజానాత్మక అనువాదకురాలు కూడా. ఈమెకు బాల్యవివాహమైనా జీవితం మొత్తం అవివాహిత మాదిరిగానే గడిపింది.
ఈమెకు హిందీ సాహిత్యంలోని ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందాయి. భారత సాహిత్యాకాశంలో ధృవతారగా పిలువబడే ఈమె.. గత శతాబ్దంలో అత్యంత లోకప్రియమైన మహిళా సాహిత్యకారిణిగా వెలుగొందింది. ప్రముఖ కవి సూర్యకాంత్ త్రిపాఠీ నిరాలా ఈమెను ‘విశాల హిందీ మందిరపు సరస్వతి’గా అభివర్ణించారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more