నాట్యం, సంగీతం.. ఈ రెండూ దేశ కళలకు పెట్టింది పేరు! ఒకప్పుడు ఎంతో గౌరవంగా భావించే ఈ కళలు.. కాలక్రమంలో వాటి ఆదరణ తగ్గుతూ వచ్చింది. ఒకానొక దశలో అవి అంతరించిపోయాయేమోనన్న అనుమానం కలగక మానలేదు. అలాంటి సమయంలో వీటి విశిష్టత గురించి చాటిచెబుతూ.. అంతరించిపోతున్న ఆ కళలకు ఎనలేని సేవ చేసిన వనితలు ఎందరో పుట్టుకొచ్చారు. అలాంటివారిలో బెంగుళూరు నాగరత్నమ్మ ఒకరు.
జీవిత చరిత్ర :
1878 నవంబరు 3వ తేదీన మైసూరు దగ్గరలోని నంజనగూడు అనే చిన్న గ్రామంలో పుట్టలక్ష్మమ్మ, సుబ్బారావు దంపతులకు ఈమె జన్మించింది. ఈమె ఒకటిన్నర సంవత్సరాల వయస్సులో వున్నప్పుడు తండ్రి సుబ్బారావు తల్లీబిడ్డలను వదిలివెళ్లిపోయాడు. ఇక అప్పటినుంచి పుట్టలక్ష్మమ్మ ఎన్నోకష్టానష్టాలను ఓర్చి, కూతురిని పెంచింది. దీంతో నాగరత్నమ్మ బాల్యము తల్లిప్రేమలో ఒడుదుడుకులు లేకుండా గడిచింది. ఈమె గిరిభట్ట తమ్మయ్య అనే గురువు వద్ద సంస్కృతం, వివిధ కళలు నేర్చుకుంది. ప్రతివిషయమూ చాలా త్వరగా ఆకళింపు చేసుకొనేది. మాతృభాష కన్నడం అయినప్పటికీ.. తెలుగు, తమిళం, ఆంగ్ల భాషలను అవలీలగా మాట్లాడేది.
పుట్టలక్ష్మమ్మ తన కూతురిని గొప్ప విదుషీమణిగా తీర్చిదిద్దిందేకు మద్రాసు చేరింది. ఈ క్రమంలోనే మంచి గురువు కోసం అన్వేషణలో కంచి, చివరకు బెంగళూరు చేరింది. అక్కడ మునిస్వామప్ప అను వాయులీన్ విద్వాంసుడు నాగరత్నమ్మకు సంగీతం నేర్పుటకు అంగీకరించాడు. కిట్టణ్ణ అను వానివద్ద నాట్యాభ్యాసం, తిరువేంగడాచారి వద్ద అభినయకౌశలం నేర్చుకుంది. తల్లి కనుసన్నలలో, గురువుల పర్యవేక్షణలో నాలుగు సంవత్సరాలు కఠోర శ్రమచేసి సంగీత నాట్యాలలో నిష్ణాతురాలయింది. ఈ విధంగా తన కూతురు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచడంతో పుట్టలక్ష్మమ్మ ఆనందానికి అవధులు లేవు. అయితే.. దురదృష్ఠవశాత్తు నాగరత్నమ్మ 14వ ఏటలో తల్లి మరణించింది.
రంగ ప్రవేశము : 1892లో మైసూరు మహారాజు కొలువులోని ఆస్థాన సంగీతకారుడు వీణ శేషణ్ణ ఇంటిలో నాగరత్నమ్మ చేసిన నాట్యము పలువురు కళాకారులను, సంగీతవిద్వాంసులను ఆకర్షించింది. అనతికాలంలోనే మహారాజావారి కొలువులో సంగీత నాట్య కళాకారిణి స్థానములో కుదుర్చుకుంది. నాగరత్నమ్మ పేరుప్రఖ్యాతులు దశదిశలా వ్యాపించాయి.
సంగీత సేవ : కర్ణాటక సంగీతంలో నాగరత్నమ్మ తనదైన ఒక కొత్త బాణీని సృష్టించుకొంది. ఆమెకు త్యాగరాజ కృతులంటే ఎంతో ఇష్టము. సాహిత్యాన్ని చక్కగా అర్థం చేసికుని, హృదయాల్లో హత్తుకొనేటట్లు పాడగలిగేది. ఆమె గళంలో స్త్రీ కంఠంలోని మాధుర్యంతోపాటు పురుష స్వరపు గాంభీర్యము కూడ మిళితమై వినసొంపుగా ఉండేది.
మరణం : నాగరత్నమ్మ మే 19, 1952న ప్రాణాలను త్యజించింది. ఆమెకు త్యాగరాజస్వామి చెంతే దహన సంస్కారాలు జరిపారు. ఆమె సమాధి త్యాగరాజస్వామి ఆలయానికి ఎదురుగానే వుంది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more