పాత తరం తెలుగు సినిమారంగానికి చెందిన కథానాయిక ‘కృష్ణకుమారి’ని ‘అభినయానికి మారుపేరు.. తెలుగుదనానికి చిరునామా’గా అభివర్ణిస్తారు. ఈమె మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ.. అచ్చు తెలుగమ్మాయిలా హావభావాలు పలుకుతూ, ప్రేక్షకులను అలరించింది. అనతికాలంలోనే తెలుగు భాషను నేర్చుకుని సినీజనాలను ఆశ్చర్యపరిచింది. నటిగా తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్న ఈమె.. ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
జీవిత చరిత్ర :
1936 మార్చి 6వ తేదీన పశ్చిమబెంగాల్ లో కృష్ణకుమారి జన్మించింది. నాన్నగారి ఉద్యోగరీత్యా తరచుగా బదిలీల కావడంతో ఈమె విద్యాభ్యాసం రాజమండ్రి, చెన్నై, అస్సాం, కలకత్తా మొదలైన ప్రదేశాలలో జరిగింది. మెట్రిక్ అస్సాంలో పూర్తయిన తర్వాత వీరి కుటుంబం మద్రాసుకు చేరింది. అక్కడే ఎక్కువకాలం వుండటంతో ఈమెకు అనుకోని ఓ సందర్భంలో సినీ అవకాశం వచ్చింది. ఇక అప్పటినుంచి ఈమె వెనుదిరగకుండా తన సినీ కెరీర్ ని విజయవంతంగా కొనసాగించింది.
సినీ జీవితం :
ఒకసారి కృష్ణకుమారి తన తల్లితో కలిసి ‘స్వప్నకుమారి’ సినిమా చూసేందుకు వెళ్లింది. అదే సమయంలో అక్కడికి ప్రముఖ గాయకుడు సౌందరరాజన్ కుమార్తె భూమాదేవి కూడా వచ్చింది. అప్పుడు కృష్ణకుమారిని చూసిన భూమాదేవి.. ఆమెకు సినిమాల్లో అవకాశం కల్పించాలని అనుకుంటుంది. వెంటనే ఆమె వారి దగ్గరకు చేరుకుని ‘నవ్వితే నవరత్నాలు’ సినిమా కోసం ఓ కథానాయికను వెతుకుతున్నట్లు కూడా చెప్పింది. ఇక తర్వాతి రోజే కృష్ణకుమారి ఇంటికి భూమాదేవి చేరుకుని, తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఆమెకు ఆ సినిమాలో కథానాయిక పాత్రను ఇచ్చారు. అలా ఆ విధంగా కృష్ణకుమారి 1951లో ‘నవ్వితే నవరత్నాలు’ సినిమా ద్వారా తెలుగు సినీరంగానికి పరిచయమయ్యారు.
ఇక ఆ తర్వాత ఆమె వరుసగా కథానాయికగా అవకాశాలు అందిపుచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఈమె నటించిన తర్వాత చిత్రం ‘పిచ్చి పుల్లయ్య’లో మంచి నటన కనబరిచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత నటించిన ‘పల్లె పడుచు, బంగారు పాప’ సినిమాల్లోని పాత్రలు ఈమెను పరిశ్రమలో ఓ స్థాయిలో నిలబెట్టాయి. మొత్తంగా సుమారు రెండు దశాబ్దాల నటజీవితంలో ఈమె సుమారు 110 సినిమాలలో నటించింది. వీటీలో ఎక్కువగా తెలుగు సినిమాలైతే... 15 కన్నడ చిత్రాలు, మరికొన్ని తమిళభాషా చిత్రాలున్నాయి. ఈమె ఆనాటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, కృష్ణంరాజు, జగ్గయ్య, హరనాథ్, అందరు మహానటులతోను నటించి మెప్పించింది.
వ్యక్తిగత విషయాలు :
బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్తో కృష్ణకుమారి వివాహమాడింది. నిజానికి వీరిది ప్రేమవివాహం. స్నేహితుల ద్వారా అజయ్ తో పరిచయం అయిన కుమారి.. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. అది 1969లో వివాహబంధంగా మారింది. వీరికి ఒక అమ్మాయి - దీపిక. వీరి అల్లుడు విక్రం మైయా, మనవడు పవన్. వ్యాపారరీత్యా భర్త బెంగుళూరులో ఉండగా ఈమె కూడా మద్రాసు వీడి బెంగుళూరులో మకాం పెట్టారు. కొంతకాలం విరామం తర్వాత అత్తమామల ప్రొత్సాహంతో తిరిగి నటించడం మొదలుపెట్టింది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more