Vasireddy seethadevi biography who is a famour naval and story writer

vasireddy seethadevi news, vasireddy seethadevi life story, vasireddy seethadevi navals, vasireddy seethadevi stories, vasireddy seethadevi wikipedia, vasireddy seethadevi biography, vasireddy seethadevi story, vasireddy seethadevi life, telugu naval writers, telugu story writers, telugu famous writers

vasireddy seethadevi biography who is a famour naval and story writer

‘‘నక్సలిజం’’ నవలతో సంచలనం సృష్టించిన సీతాదేవి!

Posted: 10/17/2014 05:51 PM IST
Vasireddy seethadevi biography who is a famour naval and story writer

తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ప్రసిద్ధ రచయితలు వున్నారు. అందులో కొంతమంది నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రాసిన నవలలు సంచలనం సృష్టించినవి ఎన్నో వున్నాయి. ఇతరుల మనోభావాలు దెబ్బతగలకుండా ఆయా నవలలు రచించినప్పటికీ.. వాటివల్ల సమస్యలు వస్తాయన్న నెపంతో ఆనాడు ప్రభుత్వం కొన్ని నవలలను నిషేధించడం జరిగింది. అందులో తెలుగు ప్రసిద్ధ నవలా-కథ రచయిత్రి ‘‘నక్సలిజం’’ గురించి రాసిన ‘‘మరీచిక’’ నవల ఒకటి! అప్పట్లో ఈ నవల మీద ఎన్నో చర్చలు జరిగాయి. అయితే చివరగా ఇతర సాహిత్యకారుల అభిప్రాయాలపై దానిని తిరిగి మళ్లీ ప్రచురించడం జరిగింది.

సీతాదేవి జీవిత చరిత్ర :

1933 డిసెంబర్ 15వ తేదీన గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో నివాసమున్న వాసిరెడ్డి రాఘవయ్య, రంగనాయకమ్మ దంపతులకు వాసిరెడ్డి సీతాదేవి జన్మించారు. ఈమె చిన్నవయస్సులో వున్నప్పుడే కుటుంబం మొత్తం చెన్నైకు చేరుకున్నారు. ఈమె చదువుకున్నది కేవలం 5వ తరగతివరకే అయినా... ప్రైవేట్ గా హిందీ ప్రచారక్, ప్రవీణ, సాహిత్య రత్నలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., ఎమ్.ఎ. పూర్తిచేశారు. నవలలు, కథలు రాయాలనే ఆసక్తి ఈమెకు చిన్నతనం నుండే వుండేది. ఆ ఆసక్తితోనే ఈమె ఎన్నో నవలలు, కథలను రాశారు. ప్రసిద్ధ రచయిత్రిగా పేరు సాధించిన ఈమెకు ‘‘ఆంధ్రపెర్ల్‌బక్’’ బిరుదు లభించింది.

ఈమె రచించిన మొదటి నవల ‘‘జీవితం అంటే’’ (1950)... తొలి కథ ‘‘సాంబయ్య పెళ్ళి’’ (1952). ఇక అప్పటినుంచి తన కలానికి పనిపెట్టిన ఆమె.. ఎన్నీ సమస్యలు వచ్చినా వెనుదిరిగి చూడలేదు. సుమారు 39 పైగా నవలలు మరియు 100 పైగా కథలు రచించారు. ఇందులో కొన్ని ప్రసిద్ధి చెందగా.. మరికొన్ని సంచలన సృష్టించాయి. అందులో ‘‘మరీచిక’’ నవల ఒకటి! 1982వ సంవత్సరంలో ‘‘నక్సలిజం’’ గురించి రచించిన ‘‘మరీచిక’’ నవలను రాష్ట్రప్రభుత్వం నిషేధించింది. కొన్నాళ్లపాటు ఈ నవలపై తీవ్ర చర్చలు కూడా జరిగాయి. అయితే తర్వాత ఆరుద్ర వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై హైకోర్టు కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది.

ఇక ప్రసిద్ధ చెందిన నవవలో ‘‘మట్టి మనిషి’’ (2000)గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఈ నవల ఏకంగా 14 భాషలలోకి అనువదించబడింది. అలాగే ఈమ నవలల్లో బాగా ప్రాచుర్యం పొందినవి కొన్ని తెలుగు సినిమాలుగా మరికొన్ని దూరదర్శన్ సీరియల్లుగాను నిర్మించబడ్డాయి. ‘‘సమత’’ నవల ఆధారంగా ‘‘ప్రజా నాయకుడు’’, ‘‘ప్రతీకారం’’ నవలను ‘‘మనస్సాక్షి’’ సినిమాగా, మానినీ మనసును ఆమె కథ సినిమాలుగా వచ్చాయి. ‘‘మృగతృష్ణ’’ నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు.
ఈమె కేవలం రచయితలు రాయడం మాత్రమే కాదు.. జవహర్ బాలభవన్ డైరెక్టర్ గా పనిచేశారు. 1985 - 1991 మధ్యకాలంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డు సబ్యురాలిగా సేవలందించారు.

అవార్డులు

1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం - ఐదు సార్లు
2. ఆత్మగౌరవ పురస్కారం
3. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం - గౌరవ డి.లిట్. (1989).
4. శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం - గౌరవ డి.లిట్. (1989)
5. తెలుగు విశ్వవిద్యాలయం - జీవితకాల సాఫల్య పురస్కారం (1996)

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vasireddy seethadevi  telugu famous writers  telugu navals writers  telugu writers  

Other Articles