Seemandhra private hospitals bandh police are threatening

Seemandhra Private Hospitals Bandh Police are Threatening, Seemandhra Private Hospitals Bandh in vijayawada, seemandhra vijayawad a, samaikyandhra movement,

Seemandhra Private Hospitals Bandh Police are Threatening, Seemandhra Private Hospitals Bandh in vijayawada

ప్రైవేటు ఆసుపత్రులు బంద్-పోలీసులు బెదిరిస్తున్నారు

Posted: 10/05/2013 08:25 AM IST
Seemandhra private hospitals bandh police are threatening

ప్రైవేటు ఆసుపత్రులు బంద్..

సీమాంధ్రలోని ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించకుండానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నోట్ ప్రవేశ పెట్టడం వల్ల సీమాంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సీమాంధ్రలోని ప్రైవేటు ఆసుపత్రుల బంద్ పాటిస్తున్నట్లు సమైక్యాంధ్ర వైద్యుల జేఏసీ పేర్కొంది. బంద్ నుండి అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్లు, త్వరలో 'సీమాంధ్ర డాక్టర్ల చలో ఢిల్లీ' కార్యక్రమంలో వైద్యులు పెద్ద ఎత్తున్న పాల్గొననున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని కేంద్రం ప్రకటించేంత వరకు తమ నిరసనలు కొనసాగుతాయని సమైక్యాంధ్ర వైద్యుల జేఏసీ స్పష్టం చేసింది.

 

బెదిరిస్తున్నారు ….

శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు బెదిరిస్తున్నారని విద్యుత్ ఉద్యోగులు ఆరోపించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మెతో విజయవాడ సమీపంలోని ఎన్టీటీపీఎస్ లో 1260 మెగవాట్ల సామర్థ్యం గల 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయిన విషయం తెలిసిందే. శనివారం విద్యుత్ జేఏసీ నేతలు మాట్లాడుతూ తాము శాంతియుతంగా సమ్మె చేస్తుంటే పోలీసులు తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడున్న టెంట్ తీసేయాలని, విధులకు హాజరయ్యే వారిని బెదిరించవద్దని పోలీసులు పేర్కొన్నట్లు తెలిపారు. తాము ఎవరినీ బెదిరించడం లేదని, టెంట్ వేసుకుని శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్నామన్నారు.

 

సమ్మె చేయడంతో సుమారు 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని, ఏడో యూనిట్ సర్వీస్ కూడా ట్రిప్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కొంతమంది ఉద్యోగస్తులను బెదిరించినట్లు తమపై పోలీసులు కేసులు నమోదు చేశారని ఉద్యోగులు ఆరోపించారు. వెంటనే విభజన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. మెరుపు సమ్మె చేయడం వల్ల ఆరు జిల్లాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కావడం లేదు. జిల్లాలోని గుణదల, తాళ్లపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లలో సరఫరాను నిలిపివేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more