కృష్ణా జిల్లా విజయవాడలో థర్మల్ పవర్ స్టేషన్ లో తాళ్లపల్లి ఫీడర్ 7వ యూనిట్ లో ఈరోజు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 1760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం పునరుద్దరణకు ఎంత సమయం పడుతుందో తెలియదని యాజమాన్యం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినెట్ అమోదం తెలపడం పై ఆగ్రహించిన విద్యుత్ ఉద్యోగ జెఎసి పిలుపు మేరకు సిబ్బంది విధులకు హాజరు కాలేదు. మరోవైపు విటిపిఎస్ సిబ్బంది జెన్ కో డైరెక్టర్ ఆంజనేయ రావును ఘెరావ్ చేశారు. ఈ సమ్మెలో మూడు వేల మంది విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయినట్లు సమాచారం అందుతోంది. మరి కొన్ని గంటలు ఈ పరిస్థితి నెలకొంటే దక్షిణాది గ్రిడ్ కు విద్యుత్ సరఫరా ఆగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఐదు రాష్ట్రాలో ఈ ప్రభావం పడనుండడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముస్తాబు
బెజవాడ కనకదుర్గ ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 5 నుంచి 13 వరకు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. దసరా వేడుకలకు భారీ స్థాయిలో జరిపేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. లక్షలాదిగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగమంతా ఏర్పాట్లలో మునిగిపోయింది. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆలయ ప్రాంగణానికి అలంకారాలు దిద్దుతున్నారు. ఈ పది రోజుల్లో దాదాపుగా 10 లక్షల మంది దాకా భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం మొత్తానికి రంగులేశారు. గోపురాన్ని స్వర్ణకాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు.
ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ప్రదేశాల్లో బారికేడ్లు పెట్టారు. క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్ల ఏర్పాటు, ఇతరత్రా పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. తొక్కిసలాట జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు అమర్చారు. స్నాన ఘట్టాల్లో రోగాలు వ్యాపించకుండా ఉండేందుకు బ్లీచింగ్ పౌడర్ను చల్లుతున్నారు. ఈ ఉత్సవాల్లో కనకదుర్గా దేవి పది రోజుల పాటు పది రూపాల్లో భక్తులను అలరించనుంది.
న్యాయవాదుల ఫైట్
తెలంగాణ నోట్ పై కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో న్యాయవాదులు రోడ్లపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. న్యాయమూర్తులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. టి.నోట్ ను వ్యతిరేకిస్తూ విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
వైసిపి, జేఏసీ నేతల మధ్య ఫైట్
సీమాంధ్ర బంద్ లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి. విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జేఏసీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల 72గంటల పాటు సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయడానికి వైసిపి నేతలు చేరుకున్నారు. అక్కడనే ఉన్న జేఏసీ నేతలు వీరిని అడ్డుకున్నారు. పార్టీ జెండాలు, కండువాలు తీసేసి రావాలని జేఏసీ నేతలు సూచించారు. తాము జెండాలతోనే వస్తామని వైసిపి నేతలు స్పష్టం చేశారు. దీనికి జేఏసీ నేతలు అభ్యంతరం చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వైసిపి నేతలను నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఆందోళనలో ఎవరైనా రావచ్చని..కాని జెండా, ఎజెండాలు పక్కన పెట్టి రావాలని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. జెండా, ఎజెండాలు పక్కన పెట్టకుండా వస్తే రానిచ్చేది లేదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. తాము 48గంటల పాటు బంద్ కు పిలుపునిచ్చినట్లు జేఏసీ నేతలు పేర్కొన్నారు. అనంతరం చెరోపక్క ఆందోళనలు చేయడానికి నిశ్చయించుకున్నారు. జేఏసీతో కలిసి ఆందోళన చేయడం లేదని, తాము స్వంతగా ఆందోళన చేయడం జరుగుతోందని వైసిపి నేత పేర్కొన్నారు. ఈ పరిస్థితి రావడానికి కాంగ్రెస్, టిడిపి పార్టీలు కారణమని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more