ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతిఒక్కరు ఆఫీసు పనులతోపాటు గృహ అవసరాల నిమిత్తం ఎక్కువ ఒత్తిడిని భరించాల్సి వుంటుంది. ఎంత త్వరగా పనులను పూర్తి చేయాలనుకున్నాగానీ సాధ్యపడదు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై చేయాల్సిన పనులను కూడా అరకొరగా చేస్తారు. ఈ ఒత్తిడి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలకు కూడా గురిచేస్తుంది. రాత్రివేళ నిద్రకూడా పూర్తి కాదు. మరి అటువంటి ఒత్తిడిని అదుపు చేయాలంటే అంత సామాన్య విషయం కాదు. అయితే కొన్ని ఆహారపదార్థాల ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. న్యూట్రీషియన్స్, విటమిన్స్ ఎక్కువగా వుండే ఆహారపదార్థాలను నిత్యం తీసుకుంటే ఆరోగ్యంగా వుండటంతోపాటు ప్రశాంతంగా వుండొచ్చు. మరి ఆ ఆహారపదార్థాలేంటో ఒకసారి తెలుసుకుందాం..
1. పాలు : పాలలో వుండే ట్రిప్టోఫాన్ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి అవసరమయ్యే సెరోటోనిన్ ఏర్పాటుకు సహాయపడుతుంది. అలాగే ఇందులో వుండే ల్యాక్టోస్ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి.
2. బాదం : ఒత్తిడిని జయించడానికి అవసరమయ్యే జింక్ ఖనిజం, విటమిన్ బి12 ఇందులో పుష్కలంగా వుంటాయి. ఈ పోషకాలు మీ మనస్సు సమతుల్యస్థితి నిర్వహించడానికి, ఆందోళనను దరంగా ఉంచడానికి సహాయపడుతాయి.
3. బెర్రీస్ : ముఖ్యంగా బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. అంతే కాదు ఇందులో ఉన్న విటమిన్ సి ఒత్తిడితో పోరాడే ఔషధ గుణాలు అధికంగా ఉన్నందు వల్ల... ఒత్తిడిని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులో వుండే ఫైబర్ కంటెంట్ రక్తప్రసరణను మెరుగుపరచి, రక్తంలోని షుగర్ లెవన్ ను కంట్రోల్లో ఉంచుతుంది.
4. సెరల్స్ (ధాన్యాలు) : ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం సమయంలో ధాన్యాలతో తయారుచేసిన ఆహారం తీసుకుంటే ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.
5. ఆస్పరాగస్ : ఇందులో మోతాదుకు మించి ఫోలిక్ ఆసిడ్స్ అధిక శాతంలో ఉంటుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.
6. అవొకావడో : ఇందులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది మెంటల్ హెల్త్ కు, నెర్వస్ హెల్త్ కు చాలా అవసరం. దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే.. నిత్యం వేధించే ఒత్తిడిని జయించవచ్చు.
7. ఓట్స్ : మన శరీరానికి అవసరమయ్యే సెరోటోనిన్ స్థాయిలను మెరుగుపర్చేందుకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, మెదడును ప్రశాంతంగా వుంచడంతో కీలకపాత్ర వహిస్తుంది.
8. అరటిపండ్లు: ఇందులో ఫైబర్ చాలా తక్కువ మోతాదులో వుంటుంది. ఫలితంగా గ్యాస్ ప్రాబ్లమ్ ను తగ్గిస్తుంది. దాంతో ప్రశాంతగా, ఒత్తిడి లేకుండా గడపడానికి ఇవి బాగా సహాయపడుతాయి.
9. గ్రీన్ టీ: ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తీసుకుంటే.. అది మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు ప్రభావం కలిగి ఉంటుంది.
10. డార్క్ చాక్లెట్ : ఇందులో ఉండే అనండమైన్ (anandamine) అనే కంటెంట్ మెదడులోని డోపమైన్ లెవల్స్ ను పెంచి.. విశ్రాంతి, ఒత్తిడి లేకుండా చేస్తుంది. వీటిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్ (పిఇఎ) ఎండార్ఫిన్ స్థాయిల్ని తొలగించి సహజసిద్దమైన యాంటీ - డిప్రెస్సెంట్గా పనిచేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more