
ప్రపంచం మొత్తనికి సరిపోయే పవర్ రాబోతోంది. రేపు ఉదయం భారీ ఎత్తున పవన్ పవర్ ప్రజల మద్యకు రాబోతుంది. ‘కెమెరా మేన్ గంగతో రాంబాబు’ రిలీజ్ కి సిద్ధమైంది. ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకులు రకరకాల అంచనాలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని ఎంతో ధీమాతో ఉన్నారు. ఎందుకంటే... వాళ్లకో సెంటిమెంట్ ఉందని చెబుతున్నారు. అదేంటంటే... గతంలో పవన్ కల్యాణ్ ఓ జర్నలిస్టు పాత్రలో ‘బంగారం’లో నటించాడు. ఆ చిత్రం బీ,సీ సెంటర్లలో ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు పవన్ మళ్లీ జర్నలిస్టు అవతారం ఎత్తాడు. కాబట్టి పవన్ కి జర్నలిస్టు పాత్ర కలిసొచ్చిందనీ... పైగా బద్రీ తరువాత పూరీ జగన్నాథ్ - పవన్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ మరోసారి వర్కౌట్ అవుతుందని ఆశిస్తున్నారు.