భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ లండన్ ఒలింపిక్స్ లో అరుదైన రికార్డు సాధించాడు. పురుషుల సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్న మొదటి భారతీయ ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ప్రి క్వార్టర్స్లో శ్రీలంక ఆటగాడు కరుణరత్నేను 21-14, 15- 21, 21-9 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు చేరుకోవడం ద్వారా అతడీ ఘనత సాధించాడు.