
లండన్ ఒలింపిక్స్లో పాల్గొనే దంపతులుగా రికార్డులకెక్కిన ఆస్ట్రేలియా షూటర్లు రసెల్ మార్క్, లారిన్లు ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ పేరు చెబితేనే మండి పడుతున్నారు. లండన్ ఒలింపిక్ విలేజ్లో తమకు విడివిడిగా గదులు కేటాయించడమే దానికి కారణం. ఇంతకు ముందు తాము పాల్గొన్న చాలా టోర్నీల్లో ఒకే గదిలో ఉండి పతకాలు సాధించామని, ఇప్పుడు కూడా అలాగే తమకు సౌకర్యం కల్పించాలని ఏఓసీ ని కోరారు. అయితే దీనికి నిరాకరించిన అధికారులు ఒకే బెడ్ను పంచుకోవాలనుకుంటే హోటల్లో గదిని అద్దెకు తీసుకొమ్మని ఆ జంటకు సలహా పడేశారు. ఈ మధ్యన మార్క్ నిద్ర మాత్రల యాడ్కు, లారిన్ ఓ జూ పత్రిక కోసం ఫొటో షూట్లో పాల్గొన్నారు. ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారులు నిద్ర మాత్రల వాడకంపై ఏఓసీ నిషేధం విధించింది. అయినా ఫొటో షూట్లో పాల్గొనడంవల్లనే తామిద్దరినీ విడిగా ఉంచారని మా ర్క్ అన్నాడు. ఏఓసీ చర్యపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు.
