శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ బుధవారం ఖరారు చేసింది. కెప్టెన్గా మహేంద్రసింగ్ ధోనీ, వైస్ కెప్టెన్గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యారు. ఈ జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు విశ్రాంతి కల్పించగా ఆసియా కప్లో ఎంపికవ్వని టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్లకు స్థానం కల్పిస్తూ 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.
జట్టులోని సభ్యులు : మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), విరాట్ కోహ్లీ (వైస్ కెప్టెన్), గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్, ప్రగ్యాన్ ఓఝా, వినయ్ కుమార్, రాహుల్ శర్మ, మనోజ్ తివారీ, అశోక్ దిండా, అజ్యెంక రహానే, ఉమేష్ యాదవ్. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ఈసారి బిసిసిఐ మొండి చెయ్యి చూపించింది. జులై 21 నుండి శ్రీలంకలో ప్రారంభం కానున్న ఐదు అంతర్జాతీయ వన్డేలు, ఒక ట్వంటీ20 మ్యాచ్లు ఆడనుంది.