
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రయాణం మొదలుపెట్టిన మమత ఏ నిర్ణయం తీసుకున్నా చర్చనీయాంశమే. తాజాగా చేనేత కార్మికులపై ఆమె చూపిన మమత ఇప్పుడు మళ్లీ మీడియాకు ముఖ్యవార్తయింది. చేనేత వస్త్రాలను పెట్రోల్ బంకుల్లో అమ్మాలని వాటి యాజమాన్యాలకు ఆమె హుకుం జారీ చేశారు. కుదరదని చెప్పే బంకులపై 'మమత' తగ్గే ప్రమాదం ఉండటంతో యాజమాన్యాలు తప్పనిసరిగా అమ్మకాలు చేపట్టాల్సి వస్తోంది. చీరలకు స్త్రీలు ఎగబడితే పరిస్థితి ఏమిటన్నది చిన్న చిన్న స్థలాల్లో బంకులు నడుపుకుంటున్న వారు గుంజాటన పడుతున్నారు. అప్పుడేముంది ఓ బెంగాల్ స్త్రీ రేపు రా అనాల్సిందే

