ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని గుంటూరు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కృష్ణా డెల్టాకు ఈ సీజన్లో బ్రిటిష్ కాలం నుంచి నీరు విడుదలవుతోందని, ఆపడానికి ఎవరికీ హక్కు లేదని రాయపాటి అన్నారు. కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ నుంచి నీరు విడుదల చేయడాన్ని టీఆర్ఎస్ నాయకులతో పాటు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తున్న విషయం తెలిసిందే.