
ఎముకల పటుత్వం కోసం తీసుకునే కాల్షియం సప్లిమెంట్లు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నవారికి మరింత ప్రమాదకరమని వేక్ పారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్ కు చెందిన పరిశోధకులు తెలిపారు. ఎముకలకు బలాన్నిచ్చే కాల్షియం మాత్రలు ప్రొస్టేట్ కాన్సర్ రోగుల్లో మాత్రం తద్విరుద్దమైన ఫలితాలనిస్తాయని వారి ఎముకల గుల్లబారిపోయేలా చేస్తాయని పేర్కొన్నారు. అంతేకాదు. గుండె జబ్బుల ప్రమాదాన్నీ పెంచుతాయన్నారు. మ్రుదుల్ దత్తా సారథ్యంలోని పరిశోధకులు కమిటి తమ అధ్యయనం నిమిత్తం 5 వేల మంది ప్రొస్టెట్ క్యాన్సర్ రోగులను ఎంపిక చేసుకున్నారు. వారికి ఏటా హార్మోన్ థేరపీని అందచేశారు. అప్పుడే వీరికిస్తున్న కాల్షియం, విటమిన్ –డి మాత్రల పని తీరును పరిశీలించారు. ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నవారిలో ఎముకలకు బలాన్నివ్వాల్సిందిపోయి .. అవి మరింత దుర్భలంగా తయారయ్యేలా కాల్షియం పనిచేసినట్లు స్పష్టమైందని గుర్తించారు.