20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Maruti.gif

    Jul 20 ,2012 11:21 am

    Maruti labour standoff at Manesar plant may hit investment climate

    అగ్రగామి కార్ల సంస్థ మారుతి సుజుకీ ఉత్ప త్తి కేంద్రంలో చెలరేగిన హింసాకాండ పారిశ్రామిక రంగం లో పెను సంచలనమే సృష్టిస్తోంది. మనేసర్ ప్లాంట్‌లో జరిగిన హింసాకాండలో హెచ్ఆర్ జిఎం అవినాష్ కుమార్ దేవ్ మరణించగా అనేక మంది ఎగ్జిక్యూటివ్‌లు గాయపడ్డారు. కార్మికులు, యాజమాన్య ఉద్యోగులకు మధ్య మొదలైన స్వల్ప ఘర్షణ తీవ్ర రూపం దాల్చి హింసాకాండకు దారితీసింది. కార్మికులు దహనకాండకు పాల్పడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు 100 మందిని అరెస్టు చేశారు. ప్లాంట్‌లో 1,000 మంది పోలీసులను మొహరించారు.ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు మారుతి సుజుకీ ప్రకటించిం ది. ఒక సూపర్‌వైజర్‌కు మరో జూనియర్ కార్మికునికి మధ్య చెలరేగిన వివాదం మొత్తం పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. సూపర్‌వైజర్‌గా ఉన్న వ్యక్తి జూనియర్ కార్మికున్ని కులంపేరుతో దూషించడంతో కార్మికులు తిరగబడ్డారని అంటున్నారు. రెచ్చిపోయిన కార్మికులు ఆస్తుల విధ్వంసానికి దిగారు. ప్లాంట్‌లో యంత్రాలను, ముఖ్య విభాగాలను తగలబెట్టారు. ఈ మంటల్లో ఒక ఉద్యోగి సజీవదహనమయ్యారు.

    సజీవదహనమైన ఉద్యోగి ఎవరనే అంశంపై ఎలాంటి సమాచారం లేదు. ఆ తర్వాత ఆనవాళ్లను బట్టి మృతుడు హెచ్ఆర్‌జిఎం అవినాష్ కుమార్ దేవ్‌గా గుర్తించారు. మొత్తం 50 మంది కార్మికులపై ఆస్తుల విధ్వంసం, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు. మనేసర్ ప్లాంట్ ఘర్షణల్లో 50 మంది గాయపడ్డారని అందులో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. మారుతి సుజుకీ మనేసర్ ప్లాంట్‌లో ఏటా 5.5 లక్షల కార్లు ఉత్పత్తి అవుతాయి. ఇందులో ప్రధానంగా స్విఫ్ట్, డిజైర్, ఎస్టార్ వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్లాంటు మూతపడటం వల్ల కంపెనీకి రోజుకు 73 కోట్ల రూపాయల మేర నష్టం ఉంటుందని అంచనా. ఈ హింసాకాండను హర్యానా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బాధ్యులైన వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హర్యానా మంత్రి రణదీప్ సింగ్ సుర్జెవాలా హెచ్చరించారు.పారిశ్రామిక వివాదం కాదు.. మనేసర్ ప్లాంట్‌లో చెలరేగిన హింసాకాండ పారిశ్రామిక వివాదానికి సంబంధించింది కాదని మారుతి సుజుకి స్పష్టం చేసింది. గత కొద్ది నెలలుగా మారుతి సుజుకి కుదురుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కొందరు వ్యక్తులు కుట్రపన్ని ఈ సామూహిక విధ్వంసకాండకు పాల్పడినట్టుగా కనిపిస్తోందని మారుతి సుజుకీ పేర్కొంది. ఈ అల్లర్లలో హెచ్ఆర్ జిఎం అవినాష్ కుమార్ దేవ్ మరణించడం పట్ల కంపెనీ తీవ్ర పరితాపాన్ని వ్యక్తం చేసింది. మనేసర్ ప్లాంట్‌చెలరేగిన మూకుమ్మడి హింసాకాండ, దహనకాండ తమను తీవ్ర ఆందోళనకు గురిచేసినట్టు మారుతి సుజుకీ పేర్కొంది. కార్మికులు దాడి చేసి కొట్టడం వల్ల దాదాపు 100 మంది సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులు గాయపడి ఆస్పత్రి పాలైనట్టుగా వెల్లడించింది. ఈ తరహా ఘర్షణలు, అల్లర్ల ప్రభావం ఒక కంపెనీ, ఒక ప్రాంతానికే పరిమితం కావని వీటి పర్యవసానాలు ప్రభావాలు, కంపెనీకి, ప్రాంతాన్ని కూడా అధిగమించి ఉంటుందని మారుతి సుజుకీ పేర్కొంది.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers