
ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ జ్యోతి లేబొరేటరీస్ (జెఎల్ఎల్)లో హెంకెల్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఐఎల్) విలీనమైంది. జ్యోతి-హెంకెల్ విలీన ప్రతిపాదనకు శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదించినట్లు జ్యోతి ల్యాబ్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. విలీన ఒప్పందం ప్రకారం హెచ్ఐఎల్ వాటాదార్లకు తమవద్ద గల ప్రతి 8 హెచ్ఐఎల్ షేర్లకు ఒక జెఎల్ఎల్ షేరు చొప్పున లభిస్తుందని ప్రకటన తెలిపింది. జెఎల్ఎల్ 1:1 నిష్పత్తిలో జారీచేసిన 1:1 బోనస్ ఇష్యూకు సర్దుబాటు చేస్తూ షేర్ల కేటాయింపు జరుగుతుంది. విలీనం తర్వాత జ్యోతి ల్యాబ్స్ ఈక్విటీ 2.87 శాతానికి పెరగనుంది. జెఎల్ఎల్ చైర్మన్ ఎం.పి.రామచంద్రన్ విలీనంపై మాట్లాడుతూ ఖర్చులు, మార్కెటింగ్, పంపిణీ విభాగాల ఆపరేషన్స్ ఇప్పటికే సమన్వయం చేశామని, ఇప్పుడీ విలీనం మా కృషికి మరింత ప్రయోజనకారి కాగలదని పేర్కొన్నారు.