తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీనివాసుడు బంగారు నగలతో ధగధగలాడుతున్నాడు. కళ్లు జిగేల్మనే ఆభరణాలతో మెరిసిపోతున్నాడు. 12 టన్నులకు పైగా బంగారం, 52 వేల కోట్ల రూపాయల విలువైన స్వర్ణాభరణాలతో భక్తులకు కనువిందు చేస్తున్నారు. వజ్ర కిరీటాలు, కంఠాభరణాలు, వడ్డాణాలు, నాగాభరణాలు, శంఖుచక్రాలు.....ఇవన్నీ శ్రీవారి బంగారు ఆభరణాలే. ఇవే కాదు సువర్ణ పద్మపీఠం, పాదాలు, సూపురాలు వంటివి మరెన్నో ఉన్నాయి. తిరుమలేసుడు నిత్యం అలంకారంతోనే దర్శనమిస్తాడు. వివిధ అవతారాల్లో అలంకృతుడవుతున్న శ్రీవారి నగలన్నీ ఇప్పుడు సాక్షాత్కరిస్తున్నాయి. అసలు వీటి సంగతి తెలుసుకుంటే కళ్లు చెదిరిపోతాయి.